వన్డే సిరీస్ ను సునాయాసంగా గెలుచుకున్న యువ టీం ఇండియా జట్టు అనూహ్యంగా శ్రీలంకపై టీ20 సిరీస్ ను కోల్పోయింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో టీం ఇండియా పై శ్రీలంక 2-1 తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇండియా ఆటగాళ్లు చివరి మ్యాచ్ లో ఏమాత్రం ప్రభావం చూపించలేక పోయారు. కీలకమైన మూడవ మ్యాచ్ లో టీం ఇండియా ఆటగాళ్లు తేలిపోవడంతో మొత్తం సిరీస్ ను కోల్పోవాల్సి వచ్చింది.
వరుసగా అయిదు టీ20 సిరీస్ ల పరాభవం తర్వాత శ్రీలంక ఎట్టకేలకు ఈ సిరీస్ ను గెలుచుకుని పరువు నిలుపుకుంది. భారత్ ఈ మ్యాచ్ లో కేవలం 82 పరుగుల లక్ష్యంను మాత్రమే నిర్థేశించింది. దాంతో శ్రీలంక కేవలం మూడు వికెట్లు కోల్పోయి 14.3 ఓవర్లలో విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పలోయి కేవలం 81 మాత్రమే చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీం ఇండియా సింపుల్ గా విజయాన్ని సొంతం చేసుకుంది.