Switch to English

న్యాయ వ్యవస్థపై నిందలు.! పొలిటికల్ పతివ్రతలు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,177FansLike
57,764FollowersFollow

అరరె.. న్యాయ వ్యవస్థ మీద అత్యంత అసభ్యకరమైన రీతిలో ఆరోపణలు చేసేశారే.! ఉరి తీసేస్తే పోలా.? ఔను, ఇలాగే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం టీడీపీని టార్గెట్ చేసిన వైసీపీ, ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడంలేదు.

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో, ఆయనకు రిమాండ్ విధించిన ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తిపైన టీడీపీ మద్దతుదారులు కొందరు అత్యంత అసభ్యకరమైన రీతిలో దూషణలకు దిగారు. అలాంటి వారిపై చర్యల నిమిత్తం, అధికార వైసీపీ, అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.

మొత్తంగా 28 మందిని అరెస్టు చేసే దిశగా, చట్టపరమైన చర్యలు షురూ అయ్యాయి కూడా.! కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద.. చర్యలు తప్పేలా లేవు. నిజమే, న్యాయమూర్తులపైనా, న్యాయస్థానాలపైనా అభ్యంతరకర వ్యాఖ్యలు ఎవరూ చేయకూడదు. ఎవరు అలా చేసినా అది తప్పే.!

కానీ, కొన్ని సార్లు న్యాయ వ్యవస్థలోనివారూ తప్పులు చేస్తున్నారు కదా.? కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి బెయిల్ వ్యవహారంలో, ఏకంగా న్యాయమూర్తి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో అదో సంచలనం.

ఆ సంగతి పక్కన పెడితే, న్యాయమూర్తుల్ని నరికెయ్యాలి.. న్యాయమూర్తుల్ని కోవిడ్ బాధితులున్న రూమ్‌లో బంధించాలి.. అని కొన్నాళ్ళ క్రితం వైసీపీ మద్దతుదారులు, అత్యంత ఛండాలంగా వ్యవహరించారు సోషల్ మీడియాలో. అప్పట్లో కొందరి అరెస్టులు జరిగాయి.. అదీ కష్టంగా.

‘న్యాయస్థానాలు తీర్పులిస్తే మాత్రం… వాటిని అమలు చేయాల్సింది మా పోలీసులే కదా.?’ అంటూ కొందరు వైసీపీ మద్దతుదారులు అప్పట్లో సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యల్ని ఎలా మర్చిపోగలం.? వాళ్ళని అప్పట్లో వెనకేసుకొచ్చిందీ వైసీపీనే. ఇప్పుడు అదే వైసీపీ, న్యాయమూర్తులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ మీద విమర్శలు చేస్తోంది.! రాజకీయ పాతివ్రత్యం ఇలాగే వుంటుంది మరి.!

ఎందుకు అరెస్టు చేయలేదంటూ పదే పదే అప్పట్లో న్యాయస్థానాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా పట్టించుకున్న దాఖలాల్లేవ్. ఇప్పుడేమో, చర్యల కోసం ప్రభుత్వమే అత్యుత్సాహం చూపుతుండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? చట్టం, న్యాయం.. అందరికీ సమానం కాదనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

1 COMMENT

సినిమా

బిగ్‌బాస్‌తో గుర్తింపు.. ఐటెమ్ సాంగ్‌తో మళ్లీ వార్తల్లోకి శ్రష్టి వర్మ

టాలీవుడ్‌లో కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రష్టి వర్మ మళ్లీ వార్తల్లో నిలిచింది. ఇటీవల బిగ్‌బాస్ తెలుగు 9లో పాల్గొని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఆమె, ఇప్పుడు...

Yash: ధురంధర్-2 టీమ్ పై హీరో యశ్ అసహనం..! కారణమిదేనా?

Yash: మరో పాన్ ఇండియా క్లాష్ సిద్ధమవుతోంది. రెండు సినిమాలూ ప్రేక్షకులు, ఇండస్ట్రీల్లో బజ్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీటి విడుదల తేదీ ‘మార్చి 19’పైనే...

ఇళయరాజా పాటలపై సరిగమ కేసు.. కోర్టు ఆదేశాలతో పరిమితులు

సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల వినియోగంపై మరోసారి వివాదం తెరపైకి వచ్చింది. ప్రముఖ ఆడియో సంస్థ సరిగమ, తమ ఆధీనంలో ఉన్న వందకు పైగా సినిమాల...

వేలంటైన్స్ డేకి మళ్లీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీ!

వేలంటైన్స్ డే వీకెండ్‌లో విడుదలైన తెలుగు సినిమాల్లో ‘కపుల్ ఫ్రెండ్లీ’ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కించుకుంది. అదే సమయంలో రిలీజ్ అయిన ‘ఫంకీ’, ‘సీతాపయనం’...

Chiranjeevi: ‘చేతికి కట్టు’.. క్లారిటీ ఇచ్చిన చిరంజీవి

Chiranjeevi: తన భుజానికి ఉన్న పట్టీ గురించి వివరాలు వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి. శ్రేయోభిలాషులు, అభిమానుల ఆందోళనకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. ‘చేతికి...

రాజకీయం

కూటమిలో స్నేహ బంధాలు బలపడుతున్నాయి: లోకేష్ ఆత్మీయ విందు సమావేశాలు

కూటమి పార్టీల మధ్య సమన్వయం, స్నేహ బంధాలు మరింత బలపడేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ విందు సమావేశాలను కొనసాగిస్తున్నారు. మంగళవారం రాత్రి...

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదంపై సుభుదేంద్ర తీర్థ ఆవేదన

అమరావతి: తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో గతంలో కల్తీ నెయ్యి వినియోగం జరిగిందన్న ఆరోపణలపై మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై...

నెయ్యి కొనుగోలు ఆరోపణలపై టిటిడి స్పష్టీకరణ

తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ప్రసాదాల తయారీలో వినియోగించే ఆవు నెయ్యి కొనుగోలు విషయంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని టిటిడి బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. వాస్తవాలు తెలుసుకోకుండా భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రచారం...

శాసనమండలిలో రభసకు వైసీపీ పక్కదారి: జనసేన ఎమ్మెల్యేలు

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూపొందించిన బడ్జెట్‌పై చర్చించాల్సిన సమయంలో వైసీపీ శాసనమండలిలో రభస సృష్టిస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటోందని జనసేన పార్టీ ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, నిమ్మక జయకృష్ణ తీవ్రంగా విమర్శించారు....

వైద్య వృత్తిలో నైతికతే అసలైన బలం: లోకేష్

మంగళగిరిలోని ఎయిమ్స్ స్నాతకోత్సవంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని పట్టభద్రులైన వైద్యులను ఉద్దేశించి ప్రేరణాత్మకంగా మాట్లాడారు. ప్రతి నాగరికతలో వైద్యులు అత్యున్నత నైతిక స్థానంలో...

ఎక్కువ చదివినవి

తిమ్మరాజుపల్లి టీవీ నుంచి ‘టీవీ వీడియో సాంగ్’ విడుదల

కిరణ్ అబ్బవరం కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో తన KA ప్రొడక్షన్స్ పతాకంపై సుమైర స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రం “తిమ్మరాజుపల్లి టీవీ” నుంచి సెకండ్ సింగిల్ ‘టీవీ వీడియో సాంగ్’ విడుదలైంది....

కోవా బన్ విషయంలోనే అలా స్పందిస్తే, తిరుమల లడ్డూ కల్తీ విషయంలో ఇంకెంత స్పందించాలి?

కోవా బన్ ఘటనలో కేవలం అనుమానాల ఆధారంగా, ఎలాంటి ల్యాబ్ రిపోర్టులు లేకుండానే ఒక వ్యక్తిపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు జరిగిన తీరు అందరికీ గుర్తుండే ఉంటుంది. చిన్న అనుమానానికే పెద్ద దుమారం...

వ్యవసాయానికి పెద్దపీట: రైతు సంక్షేమంపై 2026–27 బడ్జెట్ ఫోకస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2026–27 వ్యవసాయ బడ్జెట్‌లో రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు డిప్యూటీ సీఎంఓ అధికారికంగా వెల్లడించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఆహార భద్రత, మార్కెట్‌లో ధరల...

డిజాస్టర్ తర్వాత కూడా తగ్గని రామ్ చరణ్ క్రేజ్.. ‘పెద్ది’ ఓవర్సీస్ డీల్ ఎంతంటే?

గేమ్ ఛేంజర్ ఆశించిన స్థాయిలో రాణించకపోయినా రామ్ చరణ్ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం పడలేదని తాజా ఓవర్సీస్ బిజినెస్ చెబుతోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదలకు...

అసెంబ్లీకి రాకుండా డ్రామాలేనా? వైసీపీపై జనసేన ఎమ్మెల్యేల ఘాటు వ్యాఖ్యలు

వైసీపీ అనేది ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ కాదు, డ్రామాలు చేసే పెద్ద కంపెనీలా మారిందని జనసేన ఎమ్మెల్యేలు బోలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా...