Switch to English

ఆంధ్రప్రదేశ్‌కి శనిలా దాపురించిన ‘రాజకీయ భూకంపం’.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

భూకంపాలు ఎక్కువగా సంభవించే దేశం జపాన్‌. అక్కడ అభివృద్ధి ఏ స్థాయిలో వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ మాటకొస్తే, భూకంపం ఫలానా చోట మాత్రమే వస్తుందని చెప్పడానికి వీల్లేని పరిస్థితి. ఫలానా చోట ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని మాత్రమే చెప్పగలం. ఫలానా చోట ‘రాదు’ అని ఏ శాస్త్రవేత్త కూడా చెప్పడుగాక చెప్పడు. కానీ, చరిత్రలో ఎప్పుడూ భారీ భూకంపాల్ని చూడని ఆంధ్రప్రదేశ్‌ మీద మాత్రం ‘భూకంపం’ పేరుతో ఎప్పటికప్పుడు కథనాలు వస్తూనే వుంటాయి. అప్పుడప్పుడూ భూ ప్రకంపనలు ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడా కన్పిస్తుంటాయి. అలాగని, ఏ భూకంపమైనా ఆంధ్రప్రదేశ్‌ని వణికించిన సందర్భం ఇప్పటిదాకా ఎప్పుడైనా వుందా.? అంటే లేదనే చెప్పాలి. కానీ, ఆంధ్రప్రదేశ్‌పై ‘భూకంప’ రాజకీయం వికటాట్టహాసం చేస్తూనే వుంది.

అమరావతిపై వైసీపీ అనుకూల మీడియా, విశాఖపై టీడీపీ అనుకూల మీడియా.. ‘భూకంపం’ ఆరోపణలు చేస్తూనే వున్నాయి. అమరావతిలో స్వల్ప స్థాయి భూకంపం వచ్చే అవకాశముందని శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పిన మాట వాస్తవం. కానీ, అది ప్రాణ నష్టం కలిగించే స్థాయిలో వుండకపోవచ్చన్నది నిపుణులు చెబుతున్నమాట. భూకంప ప్రకంపనలు ఎక్కడైనా రావొచ్చు.. అమరావతికి రిస్క్‌ కాస్త ఎక్కువ గనుక, దాన్ని దృష్టిలో పెట్టుకుని రాజధాని నిర్మాణం జరిగితే సమస్యేముంటుంది.?

ఇక, విశాఖ విషయానికొస్తే, రాత్రికి రాత్రి విశాఖ మీద ఏదో భూకంపం వచ్చి పడినట్లు.. అది సునామీకి దారి తీసి.. నగరం మునిగిపోతుందన్నట్లు టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు షురూ అయ్యాయి. ఇదంతా విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా చేయాలని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం భావిస్తుండడం వల్లేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!

విశాఖకు సుదీర్ఘమైన సముద్ర తీరం వుంది. ఇది అందరికీ తెల్సిన విషయమే. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రమైన తుపాను (హుద్‌హుద్‌) ఆ మధ్య విశాఖపై విరుచుకుపడింది. అంతమాత్రాన విశాఖ ఇమేజ్‌ డ్యామేజ్‌ అయ్యిందా.? పొలిటికల్‌ సునామీ ముందు హుద్‌హుద్‌ తుపాను ఎంత.? అవును, విశాఖకు ‘శని’ అంటూ ఏదైనా పడితే అది రాజకీయం మాత్రమే. అమరావతి విషయంలో కూడా అంతే. అమరావతిని దెబ్బతీసి, విశాఖను అభివృద్ధి చేస్తామనడం తప్పే. అమరావతిని ఉద్ధరించి విశాఖను నిర్లక్ష్యం చేస్తామనడం కూడా క్షమించరాని నేరమే.

ఆరేళ్ళ క్రితం ఏర్పడ్డ రాష్ట్రం.. ఇంకా రాజధాని ఏదో తెలియక విలవిల్లాడుతున్నాయంటే.. ప్రభుత్వాలు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్లా.? రాష్ట్రం ఇమేజ్‌ని పనిగట్టుకుని నాశనం చేస్తున్నట్లా.? అన్న ప్రశ్న సగటు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్లో కలగకుండా ఎందుకు వుంటుంది.! లక్షల ఏళ్ళ క్రిందటి పరిణామాల్ని విశ్లేషించడం శాస్త్రవేత్తల పని. అంతమాత్రాన వాటిని బూచిగా చూపి రాష్ట్రాన్ని దెబ్బతీయడమేంటి.? మీడియా నైతిక విలువలకు ఎప్పుడో తిలోదకమిచ్చేసింది ఆంధ్రప్రదేశ్‌లో. కానీ, రాష్ట్రం మీద ఇంత కక్ష గట్టి వ్యవహరించడం వైసీపీ, టీడీపీ అనుకూల మీడియా సంస్థలకే చెల్లిందేమో. తమ సంస్థల మూలాలు ఆంధ్రప్రదేశ్‌లో కాక, పొరుగు రాష్ట్రాల్లో వుండడం వల్లేనేమో.. వీలు చిక్కినప్పుడల్లా రాష్ట్రం మీద విషం చిమ్ముతున్నాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...