భూకంపాలు ఎక్కువగా సంభవించే దేశం జపాన్. అక్కడ అభివృద్ధి ఏ స్థాయిలో వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ మాటకొస్తే, భూకంపం ఫలానా చోట మాత్రమే వస్తుందని చెప్పడానికి వీల్లేని పరిస్థితి. ఫలానా చోట ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని మాత్రమే చెప్పగలం. ఫలానా చోట ‘రాదు’ అని ఏ శాస్త్రవేత్త కూడా చెప్పడుగాక చెప్పడు. కానీ, చరిత్రలో ఎప్పుడూ భారీ భూకంపాల్ని చూడని ఆంధ్రప్రదేశ్ మీద మాత్రం ‘భూకంపం’ పేరుతో ఎప్పటికప్పుడు కథనాలు వస్తూనే వుంటాయి. అప్పుడప్పుడూ భూ ప్రకంపనలు ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడా కన్పిస్తుంటాయి. అలాగని, ఏ భూకంపమైనా ఆంధ్రప్రదేశ్ని వణికించిన సందర్భం ఇప్పటిదాకా ఎప్పుడైనా వుందా.? అంటే లేదనే చెప్పాలి. కానీ, ఆంధ్రప్రదేశ్పై ‘భూకంప’ రాజకీయం వికటాట్టహాసం చేస్తూనే వుంది.
అమరావతిపై వైసీపీ అనుకూల మీడియా, విశాఖపై టీడీపీ అనుకూల మీడియా.. ‘భూకంపం’ ఆరోపణలు చేస్తూనే వున్నాయి. అమరావతిలో స్వల్ప స్థాయి భూకంపం వచ్చే అవకాశముందని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన మాట వాస్తవం. కానీ, అది ప్రాణ నష్టం కలిగించే స్థాయిలో వుండకపోవచ్చన్నది నిపుణులు చెబుతున్నమాట. భూకంప ప్రకంపనలు ఎక్కడైనా రావొచ్చు.. అమరావతికి రిస్క్ కాస్త ఎక్కువ గనుక, దాన్ని దృష్టిలో పెట్టుకుని రాజధాని నిర్మాణం జరిగితే సమస్యేముంటుంది.?
ఇక, విశాఖ విషయానికొస్తే, రాత్రికి రాత్రి విశాఖ మీద ఏదో భూకంపం వచ్చి పడినట్లు.. అది సునామీకి దారి తీసి.. నగరం మునిగిపోతుందన్నట్లు టీడీపీ అనుకూల మీడియాలో కథనాలు షురూ అయ్యాయి. ఇదంతా విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం భావిస్తుండడం వల్లేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!
విశాఖకు సుదీర్ఘమైన సముద్ర తీరం వుంది. ఇది అందరికీ తెల్సిన విషయమే. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రమైన తుపాను (హుద్హుద్) ఆ మధ్య విశాఖపై విరుచుకుపడింది. అంతమాత్రాన విశాఖ ఇమేజ్ డ్యామేజ్ అయ్యిందా.? పొలిటికల్ సునామీ ముందు హుద్హుద్ తుపాను ఎంత.? అవును, విశాఖకు ‘శని’ అంటూ ఏదైనా పడితే అది రాజకీయం మాత్రమే. అమరావతి విషయంలో కూడా అంతే. అమరావతిని దెబ్బతీసి, విశాఖను అభివృద్ధి చేస్తామనడం తప్పే. అమరావతిని ఉద్ధరించి విశాఖను నిర్లక్ష్యం చేస్తామనడం కూడా క్షమించరాని నేరమే.
ఆరేళ్ళ క్రితం ఏర్పడ్డ రాష్ట్రం.. ఇంకా రాజధాని ఏదో తెలియక విలవిల్లాడుతున్నాయంటే.. ప్రభుత్వాలు రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్లా.? రాష్ట్రం ఇమేజ్ని పనిగట్టుకుని నాశనం చేస్తున్నట్లా.? అన్న ప్రశ్న సగటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కలగకుండా ఎందుకు వుంటుంది.! లక్షల ఏళ్ళ క్రిందటి పరిణామాల్ని విశ్లేషించడం శాస్త్రవేత్తల పని. అంతమాత్రాన వాటిని బూచిగా చూపి రాష్ట్రాన్ని దెబ్బతీయడమేంటి.? మీడియా నైతిక విలువలకు ఎప్పుడో తిలోదకమిచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో. కానీ, రాష్ట్రం మీద ఇంత కక్ష గట్టి వ్యవహరించడం వైసీపీ, టీడీపీ అనుకూల మీడియా సంస్థలకే చెల్లిందేమో. తమ సంస్థల మూలాలు ఆంధ్రప్రదేశ్లో కాక, పొరుగు రాష్ట్రాల్లో వుండడం వల్లేనేమో.. వీలు చిక్కినప్పుడల్లా రాష్ట్రం మీద విషం చిమ్ముతున్నాయి.
905762 859535I saw your post awhile back and saved it to my computer. Only recently have I got a chance to checking it and have to tell you good function. 788620
59 513628Extremely good post. I just stumbled upon your blog and wanted to say that Ive truly enjoyed surfing around your blog posts. Right after all I will be subscribing to your feed and I hope you write again very soon! 202437