బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఏడో సీజన్లో ఎంటర్టైన్మెంట్ పరంగా కాస్తంత ఉపశమనం అంటే, టేస్టీ తేజనే. ఈ విషయంలో ఇంకో మాటకు తావు లేదు. కానీ, క్రమంగా ఆ ఎంటర్టైన్మెంట్ కూడా బోర్ కొట్టించేయడంతో, హౌస్లోంచి అతన్ని గెంటేశారు. పేరుకే, ప్రేక్షకుల ఓట్ల ద్వారా ఎలిమినేషన్ ప్రక్రియ.. అని చెబుతారుగానీ, అసలు కథ వేరే.!
సరే, కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవడం అనేది ప్రతి వారం తప్పనిసరి.. అది వేరే సంగతి. టేస్టీ తేజ వికెట్ పడిపోవడంపై పెద్దగా ఎవరికీ ఎలాంటి అనుమానాల్లేవు. ఇన్ని వారాలు హౌస్లో వుండటమే ఎక్కువ.. అంటారు కొందరు టేస్టీ తేజ గురించి. కాకపోతే, అంతకన్నా డల్ కంటెస్టెంట్లు హౌస్లో వున్నారన్నదీ నిర్వివాదాంశం.
ఇక, హౌస్లోంచి ఎలిమినేట్ అయ్యాక, ఇంటికి వెళ్ళే క్రమంలో టేస్టీ తేజ చేసిన అతి అంతా ఇంతా కాదు.! మీడియాతో మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడలేదాయన. మామూలుగా అయితే, కంటెస్టెంట్లు హౌస్ నుంచి బయటకొచ్చాక మీడియాకి థ్యాంక్స్ చెప్పడం, మీడియాతో నాలుగు మాటలు మాట్లాడటం జరుగుతుంటుంది.
ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు పెయిడ్ బ్యాచ్తో ర్యాలీలు చేయడం మామూలే. అయితే, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న దరిమిలా, పోలీసులు ఈ ర్యాలీ పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ, పెయిడ్ బ్యాచ్ చాలా చాలా అతి చేశారు. వారిని నిలువరించడంలో తేజ ఫెయిల్ అయ్యాడు.
హౌస్లోకి వెళ్ళే ముందు మీడియా సపోర్ట్ కోరిన టేస్టీ తేజ, హౌస్లోంచి బయటకు వచ్చాక మీడియాని పట్టించుకోకపోవడం, కొందరు మీడియా ప్రతినిథులపై చిరాకు పడటం చర్చనీయాంశంగా మారింది.
‘నువ్వేమైనా ఆస్కార్ నటుడివా.?’ అంటూ మీడియా వర్గాల్లో టేస్టీ తేజ మీద సెటైర్లు పడుతున్నాయి. అక్కడ ఆ సమయంలో, టేస్టీ తేజకి మద్దతుగా వచ్చిన అతని పెయిడ్ బ్యాచ్ కూడా, ఈ అతిపై అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.
Hello, i think that i saw you visited my website thus i came to “return the favor”.I
am trying to find things to enhance my site!I suppose its ok to
use a few of your ideas!!