Switch to English

కరోనా వస్తదీ.. పోతదీ.! సారూ, ఏం సెప్తిరి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

తెలంగాణలో నిన్న నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1850. వీటిల్లో గ్రేటర్‌ హైద్రాబాద్‌ వాటా 1572. ఆషామాషీ వ్యవహారం కాదు. తెలంగాణలో కరోనా వైరస్‌ (కోవిడ్‌ 19) విజృంభణకి నిలువెత్తు నిదర్శనం ఈ లెక్కలు. మరీ ముఖ్యంగా గ్రేటర్‌ వాసులు హడలిపోతున్నారు కరోనా వైరస్‌ దెబ్బకి. ‘బతుకు జీవుడా’ అంటూ హైద్రాబాద్‌ వదిలిపోతున్నారు చాలామంది. కానీ, తెలంగాణ ప్రభుత్వం మాత్రం ‘ఏం ఫర్లేదు.. ఆల్‌ ఈజ్‌ వెల్‌..’ అంటోంది.

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘రానున్న రెండు మూడు నెలల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య ఇంకా ఎక్కువ కాబోతోంది..’ అని సెలవిచ్చారు. అంతేనా, ‘కొంతమందికి కరోనా వచ్చినట్లు కూడా తెలియదు. కరోనా వస్తదీ.. పోతదీ..’ అంటూ చాలా లైట్‌గా మాట్లాడేశారు. పూర్తిస్థాయిలో ఇమ్యూనిటీ వున్నవారిపై కరోనా వైరస్‌ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని వైద్యులు చెబుతున్న మాట వాస్తవం. కానీ, దాన్నే ప్రమాణికంగా తీసుకుని, ‘లైట్‌ తీస్కో’మంటే ఎలా.?

కరోనా విషయంలో పెద్దగా భయపడాల్సిన పనే లేకపోతే, లాక్‌డౌన్‌ ఎందుకు విధించినట్లు.? ప్రజల్ని ఎందుకు ఇబ్బందులపాల్జేసినట్లు.? మాస్క్‌ వేసుకోకపోతే జరీమానా.. సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటించకపోతే చర్యలు.. ఇవన్నీ ఎందుకు.? ఈ ప్రశ్నలు ప్రభుత్వం వైపే సూటిగా దూసుకెళుతున్నాయి. అసలంటూ కరోనా ముప్పు తీవ్రమయ్యింది మద్యం షాపులు తెరిచాకే. ఆ తర్వాత విశృంఖలంగా మారిపోయింది కరోనా వైరస్‌.

తెలంగాణలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లోనూ పరిస్థితి తీవ్రంగానే వున్నా, తెలంగాణలో ఆ పరిస్థితి మరింత భయానకంగా మారింది. జరగాల్సిన స్థాయిలో కరోనా టెస్టుల సంఖ్య లేకపోవడంతో ప్రజల్లో ఆందోళన పెరగడం సహజమే. అలాగని టెస్టులు చేసేస్తే, భయం తగ్గుతుందా.? అంటే అదీ సబబు కాదు. పాజిటివ్‌ కేసుల సంఖ్య 2 వేల లోపు నమోదయితేనే ఇంతటి భయాందోళన వుంది జనంలో. రేప్పొద్దున్న 3 వేలు దాటేసి.. ఆ పై ఇంకా సరికొత్త రికార్డులు సృష్టిస్తే ఇంకేమన్నా వుందా.? ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత పాలకులదే. ‘అందుబాటులో వైద్యం’ అని ప్రభుత్వం చెబుతోంటే, వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు కళ్ళదుటే కన్పిస్తున్నాయి జనానికి. ప్రభుత్వాలకి ‘కమర్షియల్‌ యాక్టివిటీ’ పెరగాలి.. మరి, ప్రజారోగ్యం మాటేమిటి.? ఈ ప్రశ్నకు ప్రభుత్వాల వద్ద సరైన సమాధానమే దొరకని దుస్థితి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎక్కువ చదివినవి

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...