మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో మొట్ట మొదటిసారిగా ఓ నిజ జీవిత కథతో, అది కూడా స్వాతంత్ర సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించి, మెప్పించిన సినిమా ‘సైరా నరసింహా రెడ్డి’. అక్టోబర్ 2న దసరా కానుకగా రిలీజైన ఈ చిత్రానికి సూపర్బ్ పాజిటివ్ మౌత్ టాక్ వచ్చింది. దాంతో ఆంధ్ర తెలంగాణాలో అదిరిపోయే కలెక్షన్స్ ని రాబట్టుకుంటోంది. మొదటి రోజు ‘సాహో’ రికార్డ్స్ ని బ్రేక్ చేసి, 38.22 కోట్లతో ‘సైరా’ ఆల్ టైం ఓపెనింగ్స్ లో 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది.
సైరా మొదటి రోజే కాకూండా రెండవ రోజు, అనగా గురువారం హాలిడే కాకపోయినప్పటికీ కూడా అదే జోరు కొనసాగించి, ప్రేక్షకులను థియేటర్స్ కి రాబట్టుకుంటోంది. ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్న దాని ప్రకారం సైరా రెండవ రోజు సుమారు 10 కోట్ల షేర్ మార్క్ ని టచ్ చేస్తుందని అంటున్నారు. అలాగే రెండవ రోజు అన్ని ఏరియాల పరంగా చూసుకుంటే 80% థియేటర్స్ ఫుల్స్ అయ్యాయని అంటున్నారు. రెండవ రోజు 10 కోట్ల మార్జిన్ అనేది సూపర్బ్ కలెక్షన్స్ అని చెప్పాలి.
అలాగే రెండవ రోజుతో ‘సైరా’ 100 కోట్ల గ్రాస్ క్రాస్ చేసిన సినిమాల జాబితాలో చేరింది. టాలీవుడ్ పరంగా అన్ని భాషల్లో కలుపుకొని మొదటి రోజే 100 కోట్ల గ్రాస్ క్రాస్ చేసిన బాహుబలి2, సాహో సినిమాల తర్వాత 2 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ‘సైరా’ 3వ స్థానంలో నిలిచింది. మెగాస్టార్ చిరంజీవి తో పాటు ఆల్ ఇండియన్ స్టార్స్ అయినా అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, అనుష్క, విజయ్ సేతుపతి, సుధీప్ లాంటి వారి ప్రెజన్స్ కూడా సైరాకి పెద్ద హెల్ప్ అయ్యింది.
