మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అవుతోందంటే ఆ కిక్కే వేరప్పా.! రాజకీయాల్లోకి వెళ్ళడంతో తొమ్మిదేళ్ళు ఆ ‘కిక్’ని మిస్సయిన అభిమానులకి, ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో పదింతల కిక్ ఇచ్చిన మెగాస్టార్, ఆ తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ తీసుకున్నారు.. అదీ ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా కోసం. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ని చూసేందుకు ఆరుగురు పోలీస్ అధికారులు థియేటర్లకు వెళ్ళడం ఇప్పుడు పెద్ద నేరంగా మారిపోయినట్టుంది.
Also Read: Sye Raa Narasimha Reddy English Review
కర్నూలు జిల్లాకి చెందిన ఎస్ఐ స్థాయి అధికారులు ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాకి వెళ్ళారన్న సమాచారం ఉన్నతాధికారులకు తెలియడంతో, వారిపై ‘వీఆర్’ వేటు వేస్లూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ‘తగిన సమాచారం అందించని కారణంగా..’ అంటూ సదరు పోలీస్ అధికారులపై, ఉన్నతాధికారులు వేటు వేశారట. అయితే, ఈ విషయమై అధికారిక సమాచారం వెల్లడి కావాల్సి వుంది.
కర్నూలు ప్రాంతం నుంచే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, స్వాతంత్య్ర పోరాటాన్ని చేపట్టారు. ఆయన జీవిత చరిత్రనే సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా చుట్టుకున్న వివాదాలకూ ఈ కర్నూలు ప్రాంతమే కేంద్ర బిందువుగా మారింది. అధికార పక్షం, తెరవెనుక వుండి మరీ.. ఈ వివాదాలకు ఆజ్యం పోసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే.
Also Read: Sye Raa Narasimha Reddy Telugu Review
అయితే, ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా అదనపు షోలకు తమ ప్రభుత్వమే అనుమతినిచ్చిందనీ, సినిమాపై కుట్రలు చేస్తున్నామంటూ తమపై నిందారోపణలు చేయడం తగదని అధికార వైఎస్సార్సీపీ మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. మరోపక్క, సీడెడ్లో మెగాస్టార్ చిరంజీవికి వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిలాంటిది కాదు. అన్ని ఏరియాల్లోనూ రికార్డ్ ఓపెనింగ్స్ కనిపిస్తున్నాయక్కడ.
573389 535719Hello there, just became alert to your weblog through Google, and found that it is truly informative. Im gonna watch out for brussels. I will appreciate should you continue this in future. Lots of men and women will likely be benefited from your writing. Cheers! xrumer 592123