ప్రతిష్టాత్మక ఎస్వీబీసీ ఛానల్కు ఏపీ ప్రభుత్వం కొత్త ఛైర్మన్ను నియమించింది. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యచేంద్రను ఎస్వీబీసీ చానెల్ కు చైర్మన్ గా నియామించింది. ఈ పదవిలో సాయికృష్ణ యచేంద్ర రెండేళ్లపాటు కొనసాగనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఆ పదవికి పూర్తిస్థాయి చైర్మన్ ను నియమించినట్టైంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్వీబీసీ చైర్మన్ గా సినీ నటుడు, వైసీపీ నేత పృథ్వీని నియమించింది. ఆయనపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన స్వచ్ఛందంగా ఆ పదవి నుంచి తప్పుకున్నారు. ఎస్వీబీసీ చైర్మన్ గా పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చినా సీఎం జగన్ యాచేంద్రను ఆ పదవికి ఎంపిక చేశారని తెలుస్తోంది.
42548 904770Hello! I merely would wish to offer a huge thumbs up for that excellent info youve here during this post. I will be returning to your internet site to get more soon. 848450