గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం రావిపూడి శివారులో ఒక డిగ్రీ విద్యార్థిని విగత జీవిగా కనిపించింది. వివరాల్లోకి వెళితే, గుంటూరు జిల్లాకు చెందిన గోళ్ళపాడు గ్రామానికి చెందిన అనూష (19 సంవత్సరాలు) నరసరావుపేటలో ఒక ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చదువుకుంటోంది. అదే కళాశాలకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి ఆమెతో మాట్లాడాలని పిలిపించి ద్విచక్ర వాహనంపై రావిపాడు శివారుకు తీసుకెళ్లాడు.
అనంతరం అక్కడే గొంతు నులిమి ఆమెను దారుణంగా హత్యచేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. సమాచారం తెలుసుకున్న నరసరావుపేట గ్రామీణ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు.
ఇదిలా ఉంటే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ కళాశాల విద్యార్థులు మార్చురీ వద్ద మొదలుపెట్టి పల్నాడు రోడ్డు కూడలికి చేరుకొని ధర్నాకు దిగారు. ధర్నా సుమారు మూడు గంటలకు పైగా సాగడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది.
545097 99130I tried to submit a comment earlier, although it has not shown up. I will remember this. 937109