మహారాష్ట్ర చంద్రాపూర్ కు చెందిన వలస కూలీలు కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం ఊటుకురు వచ్చి మిరప కోతలకు రోజు వారి కూలీగా వెళ్తున్నారు. గ్రామంలోని బీసీ కాలనీలో వలస కూలీలు గుడారాలు వేసుకుని ఉంటున్నారు. అందులో ఏడాదిన్నర చిన్నారికి తల్లి అయిన శృతి ప్రమోద్ భోయర్ కూడా ఉంది. ఆమె అర్థరాత్రి సమయంలో తన చంటి పిల్ల ఏడ్వడంతో పాలు ఇచ్చేందుకు స్తనాన్ని అందించింది. చిన్నారి పాలు తాగుతున్న సమయంలోనే నిద్ర మత్తులో ఉన్న శృతి స్తనంపై పాము కాటు వేసింది.
పాము కాటుకు మెలుకువ రావడంతో కంగారు పడ్డ శృతి వెంటనే ఆ పాము తన బిడ్డను ఎక్కడ కాటు వేసిందో అనే భయంతో మరో ఆలోచన లేకుండా పామును పట్టుకుని ఒక్క ఉదుటన విసిరేసింది. అలా విసిరేసిన పాము పక్కనే ఉన్న రూపేష్ ప్రకాష్ అనే యువకుడిపై పడింది. అతడిని కూడా కుట్టిన పాము అక్కడ నుండి పారిపోయింది. శృతి అక్కడికి అక్కడే మృతి చెందడం జరిగింది. రూపేష్ మాత్రం ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. మృత దేహంను బంధువులు తమ సొంత ప్రాంతానికి తీసుకు వెళ్తున్నారు. విజయవాడలో రూపేష్ చికిత్స పొందుతున్నట్లుగా అధికారులు తెలియజేశారు.
27690 791358Hello, Neat post. Theres an issue together along with your site in internet explorer, might check this? IE nonetheless could be the marketplace leader and a huge component to folks will omit your great writing because of this difficulty. 601658