పత్రిక రంగంలో విశేష సేవలు అందించిన పొత్తూరి వెంకటేశ్వరరావు అనారోగ్య కారణంతో మృతి చెందారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు. 1934 ఫిబ్రవరి 8న గుంటూరు జిల్లా పొత్తూరులో జన్మించిన వెంకటేశ్వరరావు 1957లో పాత్రికేయుడిగా జర్నీ ప్రారంభించారు. మొదట ఆంధ్ర జనతా పత్రికకు పాత్రికేయుడిగా పని చేసిన పొత్తూరి వెంకటేశ్వరరావు ఆ తర్వాత ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, వార్త పత్రికల్లో విధులు నిర్వర్తించారు.
పాత్రికేయుడిగానే కాకుండా పలు రచనలు చేసిన పొత్తూరి ప్రెస్ అకాడమీ చైర్మన్గా వ్యవహరించారు. ఉమ్మడి రాష్ట్రంలో మీడియా రంగాని చెందిన పలు సంస్థల్లో విధులను నిర్వర్తించిన పొత్తూరి మరణ వార్త మీడియా రంగంను దు:ఖంలో ముంచింది. రాజకీయ ప్రముఖులు మరియు పలు రంగాలకు చెందిన ప్రముఖులు పొత్తూరి మరణంకు సంతాపం ప్రకటించారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, నారా లోకేష్ ఇంకా పలువురు ప్రముఖులు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతికి సంతాపం తెలియజేశారు. మీడియా రంగానికి ఆయన చేసిన సేవను గుర్తుకు తెచ్చుకున్నారు. తెలుగు తొలితరం జర్నలిస్ట్లో ఒక్కరైన డాక్టర్ పొత్తూరి మరణం జర్నలిజానికి తీరని లోటు అంటూ బండారు దత్తాత్రేయ అన్నారు. 50 ఏళ్ల పాటు మీడియా రంగానికి ఆయన చేసిన సేవ మరవలేనిది అంటూ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపంను తెలియజేశారు.
310648 175508Hi, should you want to get higher rankings, you must have a look at the plugin I left in my link, it will assist. 981914
90365 448103you make blogging glance 872074
839495 930184Delighted for you to discovered this web site write-up, My group is shopping a lot more often than not regarding this. This can be at this moment definitely what I are already seeking and I own book-marked this specific web site online far too, Ill often be keep returning soon enough to look at on your special weblog post. 967806
664213 160840magnificent issues altogether, you simply gained a brand new reader. 622831