ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళంతా.? మాజీ ముఖ్యమంత్రి సతీమణి మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే, సాటి మహిళ.. అని ఎంపీ నవనీత్ కౌర్కి ఎందుకు అనిపించలేదు.? రమ్యకృష్ణ, రాధిక, ఖుష్బూ లాంటి నటీమణులెందుకు స్పందించలేదు.?
సినీ నటి, వైసీపీ నేత, మంత్రి రోజా మీద టీడీపీ నేత బండారు సత్యానారాయణ చేసిన జుగుప్సాకరమైన విమర్శల నేపథ్యంలో ఒకరొకరుగా బయటకు వస్తున్నారు. వస్తున్నవారిలో చాలా చాలా ప్రముఖులున్నారండోయ్. ఎంపీ నవనీత్ కౌర్ స్పందించడం ఆశ్చర్యకరమే. ఖుష్బూ స్పందించడం ఇంకా ఆశ్చర్యకరం. రాధిక సంగతి సరే సరి. లిస్టులోకి రమ్యకృష్ణ కూడా వచ్చి చేరింది.
చంద్రబాబు సతీమణి మీద టీడీపీ ఎమ్మెల్యేలు చట్ట సభల్లోనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే, పైన పేర్కొన్న మహిళామణులెవరికీ.. అవి అభ్యంతరకర వ్యాఖ్యలుగా అనిపించలేదు. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే చర్యలా అనిపించలేదు కూడా.!
కొన్నేళ్ళ క్రితం సినీ నటి రేణు దేశాయ్ మీద ఇదే రోజా తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని ఇక్కడ ప్రస్తావించాలంటేనే జుగుప్సాకరంగా అనిపిస్తుంటుంది. అలా ఆమె వ్యాఖ్యానించేటప్పుడు, తానొక మహిళనన్న విషయం బహుశా రోజా మర్చిపోయి వుండొచ్చు.
అప్పుడైనా రమ్యకృష్ణ సహా రాధిక, ఖుష్బూ, నవనీత్ కౌర్ తదితరులు స్పందించి వుంటే బావుండేది కదా.? ఓహో, మహిళను ఇంకో మహిళ ఏమైనా తిట్టొచ్చన్నమాట. ఒక్కసారి రమ్యకృష్ణ కావొచ్చు, రాధిక కావొచ్చు, ఖుష్బూ కావొచ్చు, నవనీత్ కౌర్ కావొచ్చు.. పవన్ కళ్యాణ్కి అనుకూలంగా వ్యాఖ్యానించమనండి.. వారి మీద రోజా ఎలా నోరు పారేసుకుంటారో తెలుస్తుంది.
ఇలా వుంటే, పైన పేర్కొన్న లిస్టులోని నలుగురు సినీ ప్రముఖులే కాదు, మరికొందరు సినీ ప్రముఖులూ.. ఇలా కంగారు పడి మీడియా ముందుకొచ్చేసి, ‘పద్ధతులు’ నేర్పేస్తోంటే, ఇదంతా పెయిడ్ ప్రచారం కాదు కదా.? అన్న అనుమానం వస్తోంది చాలామంది నెటిజనానికి.! వారి అనుమానంలోనూ కాస్తో కూస్తో లాజిక్కు లేకపోలేదేమో.!