విశాఖపట్నం సృష్టి టుస్టుట్యూబ్ బేబీ సెంటర్ పేరుతో నడుస్తున్న ఒక ఆసుపత్రి బండారం బయట పడినది. గత పది సంవత్సరాలుగా ఈ ఆసుపత్రి చేస్తున్న దారుణాలను పోలీసులు వెలుగులోకి తీసుకు వచ్చారు. రాష్ట్రంలో పలు చోట్ల ఈ ఆసుపత్రికి బ్రాంచ్ లు ఉన్నాయి. కోల్కత్తాతో పాటు మరికొన్ని రాష్ట్రాల ముఖ్య నగరాల్లో కూడా బ్రాంచీలు ఏర్పాటు చేశారు. పిల్లలు లేని వారు వీరి వద్దకు వస్తే వారికి పిల్లలను అమ్మడం వీరు పనిగా పెట్టుకున్నారు.
పేదవారు, పిల్లలను పెంచలేని వారు, అవాంచిత గర్బం వచ్చిన వారిని ఈ ఆసుపత్రికి సంబంధించిన ఏజెంట్లు గుర్తిస్తారు. ఎవరికి అయితే డెలవరీ ఇష్టం లేదో వారిని గుర్తించి మెల్లగా ట్రాప్లో పడేస్తారు. ఒకటి రెండు నెలల పాటు వారికి ట్రీట్మెంట్ ఉచితంగా ఇచ్చి డెలవరీ చేసి చివరకు ఆ బేబీని తీసుకుని కొంత డబ్బు ఇచ్చి ఆ తల్లిని పంపిస్తారు. ఈ దందా చాలా కాలంగా సాగుతోంది. ఆ పిల్లలను డబ్బున్న పిల్లలు లేని వారికి అమ్ముతారు. విశాఖ జిల్లాలో ఒక గ్రామానికి చెందిన వితంతువు గర్బం దాల్చడం డెలవరీకి ఆసుపత్రికి వెళ్లడం ఆమె ఒట్టి చేత్తో గ్రామానికి రావడంతో ఆ గ్రామ అంగన్వాడీ కార్యకర్త గమనించింది. అనుమానం వచ్చి చైల్డ్ లైన్ కు ఫిర్యాదు చేయగా, బిడ్డను అమ్ముకున్నట్లుగా గుర్తించారు.
చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారు రంగంలోకి దిగడంతో కోల్కత్తాకు వెళ్లిన ఆ బేబీని అమ్మ ఒడికి పంపించారు. ఇదే సమయంలో సృష్టి ఆసుపత్రికి సంబంధించి మొత్తం ఆరుగురును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆసుపత్రి ఎండీతో పాటు డాక్టర్ నమ్రతను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంకా ఎంత మందిని ఇలా అమ్మారంటూ వారు వీరిని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఇద్దరు పిల్లలను వారి తల్లి వద్దకు చేర్పించినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. మొత్తానికి తీగ లాగితే డొంక కదిలినట్లుగా మొత్తం వ్యవహారం బయటకు వస్తుంది.
831131 54830Youve genuinely written a extremely good quality write-up here. Thank you extremely significantly 733725
659781 403493Hey there! Good stuff, do keep us posted when you lastly post something like that! 259098