ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. చైనాలో సద్దుమణిగిన ఈ వైరస్.. మళ్లీ తన ప్రతాపం చూపిస్తోంది. ఆదివారం దక్షిణ బీజింగ్ లో 57 కేసులు నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఏప్రిల్ తర్వాత ఒకేరోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
చైనాలోని వూహన్ లో గతేడాది డిసెంబర్ లో కోవిడ్-19 వెలుగు చూసిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని దాచిపెట్టి కాస్త లేటుగా బయటకు వెల్లడించడంతో ప్రపంచం ప్రస్తుతం సంక్షోభంలో కూరుకుపోయింది. చైనా మాత్రం కచ్చితమైన లాక్ డౌన్ పాటించి కేసులను గణనీయంగా కట్టడి చేసింది. ప్రస్తుతం 83,132 కేసులతో 19వ స్థానంలో ఉంది.
అయితే, తాజాగా దక్షిణ బీజింగ్ లోని ఓ మార్కెట్ సమీపంలో ఆదివారం ఒక్కరోజే 57 కేసులు నమోదయ్యాయి. దీంతో వైరస్ సెకండ్ వేవ్ మొదలైందేమోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ వైరస్ సెకండ్ వేవ్ ప్రారంభమైతే మాత్రం పరిస్థితులు దారుణంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ మార్కెట్ సమీపంలోని 11 ప్రాంతాల ప్రజలను బయటకు రావొద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఆ ప్రాంతంలో లాక్ డౌన్ విధించారు.
మార్కెట్ సమీపంలో వైరస్ కేసులు వెలుగు చూడటంతో అక్కడి నుంచి ఇప్పటికే సరఫరా అయిన ఉత్పత్తుల విషయంలో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు భారత్ లో కేసుల పరంపర కొనసాగుతోంది. గత 24 గంటల్లో దాదాపు 12 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో మనదేశంలో కేసుల సంఖ్య 3,20,922కి చేరింది. అలాగే గత 24 గంటల్లో 311 మరణాలు చోటుచేసుకోవడంతో దేశంలో ఈ వైరస్ కారణంగా చనిపోయినవారి సంఖ్య 9,115కి చేరుకుంది.
74410 525707Definitely composed written content , thanks for data . 94303
212398 361949Just wanna remark that you have a extremely good web web site , I like the layout it really stands out. 715443
406525 848215Hello there! Do you know if they make any plugins to protect against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any suggestions? 888180