జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి ప్రస్తావించే నైతిక హక్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే కాదు, ఈ భూమ్మీద ఎవరికీ లేదు.! పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడైనంతమాత్రాన, ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాం.. అని ఎవరైనా అంటే, అంతకన్నా దిగజారుడుతనం ఇంకోటుండదు.
‘ఏం లోపం వుందని నువ్వు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నావ్.?’ అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి తాజాగా ప్రశ్నించేసి, తన అవివేకాన్ని చాటుకున్నారు. నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ‘ఇంట్లోని ఇల్లాలు’ గురించి నోరు పారేసుకున్నారు. ఈ రోజేమో సజ్జల వంతు.!
ఎవరింట్లో ఇల్లాలు ఎలా వుంటే, వీళ్ళకెందుకు.? పవన్ కళ్యాణ్ ఇంట్లోని ఇల్లాలి కారణంగానే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా పోయిందా.? అటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇంకో వైపు వైసీపీలో చాలామంది నేతలు.. అసలు వీళ్ళందరికీ వేరే పని లేదా.?
‘లోపం’ అనే మాట సజ్జల రామకృష్ణారెడ్డి ప్రస్తావించిన దరిమిలా, సజ్జల రామకృష్ణారెడ్డిలోని లోపాల్ని ప్రస్తావిస్తున్నారు జనసేన నేతలు. రిసార్టుల్లో సజ్జల తిరుగుతున్నాడనీ, ఇంట్లో.. ఇంట్లో.. ఏ లోపం వుందని, రిసార్టుల్లో అమ్మాయిలతో తిరుగుతున్నాడంటూ జనసేన నేత ఒకరు మీడియా ముఖంగానే ప్రశ్నించారు.
ఇలాగే వుంటుంది.. రాజకీయమంటే.! తమలపాకుతో నువ్వొకటిస్తే, తలుపు చెక్కతో గట్టిగా అట్నుంచి ఇంకో నాలుగు ఇచ్చేస్తారు మరి.! ఆ విషయం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయినా, సజ్జల రామకృష్ణారెడ్డి అయినా తెలుసుకోవాల్సి వుంటుంది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి సహా, వైసీపీ నేతలందరి వ్యక్తిగత జీవితాలూ చర్చకు వచ్చేలా వున్నాయ్.! ఏం రాజకీయమిది.? అసలేంటి లోపం వైసీపీకి.? 151 మంది ఎమ్మెల్యేల్ని 2019 ఎన్నికల్లో గెలుచుకున్న పార్టీ అది. ఇంత దిగజారుడుతనమా.?