Sai Dharam Tej: సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ.. ఏ హీరో సినిమా రిలీజైనా శుభాకాంక్షలు తెలియజేస్తూంటారు. అవసరమైన వారికి సాయం కూడా అందిస్తూంటారు. గతేడాది సైనిక కుటుంబాలకు, ఏపీ-తెలంగాణ పోలీసులకు రూ.20లక్షల సాయం చేశారు. ఇప్పుడు మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ సోషల్ మీడియాలో వెల్లడిస్తూ వీడియో పంచుకున్నారు.
‘అనాథ ఆశ్రమంలో ఇద్దరు చిన్నారులకు చికిత్స అవసరమై నాకు ఫోన్ వచ్చింది. అప్పుడు నాకు సాయిధరమ్ తేజ్ మాత్రమే గుర్తొచ్చారు. ఒక్క మెసేజ్ పెట్టగానే.. ఏం ఆలోచించకుండా ఆశ్రమంలో పిల్లలకు కావాల్సిన సాయం చేశారు. ఇందుకు ఆయనకు కృతజ్ఞతలు’ అని తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
దీంతో సాయిధరమ్ తేజ్ సహృదయానికి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో గాంజా శంకర్ లో నటిస్తున్నారు. అయితే.. టైటిల్ మార్చాలని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు ఇటివలే నోటీసులు ఇచ్చారు.
Thank you @IamSaiDharamTej your kind help for them, children sent you thank you wishes❤️❤️❤️ pic.twitter.com/gwrzmZQYR7
— I.Andrew babu (@iandrewdop) February 22, 2024