టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ( Virat Kohli) వన్డేలో 50 సెంచరీలు పూర్తి చేసుకున్న సందర్భంగా అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్( Sachin Tendulkar) పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డుని బ్రేక్ చేసిన కోహ్లీ పై సచిన్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
‘ మొదటిసారి నిన్ను టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో చూశాను. అప్పుడు మిగతా ఆటగాళ్లు నిన్ను ప్రాంక్ చేసి నా కళ్ళు మొక్కమని చెప్పారు. ఆ రోజంతా నిన్ను చూసి నవ్వాపుకోలేకపోయాను. కానీ ఈరోజు నువ్వు నా గుండెను తాకావ్. ఆరోజు చిన్నోడిలా కనిపించిన నువ్వు నీ పట్టుదల, నైపుణ్యంతో ‘విరాట్’ లా ఎదిగావు. అందుకు సంతోషిస్తున్నా. సెమీ ఫైనల్ లో.. అదీ నా హోమ్ గ్రౌండ్ లో నా రికార్డును బ్రేక్ చేసినందుకు ఆనందంగా ఉంది’ అని తన ట్వీట్ లో పేర్కొన్నాడు.
వరల్డ్ కప్( World Cup)సెమీ ఫైనల్స్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ ఇన్నింగ్స్ 41.4 ఓవర్లో ఫెర్గుసన్ వేసిన బాల్ కి రెండు పరుగులు చేసిన కోహ్లీ తన 50వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.