Renu Desai: నటి రేణూ దేశాయి (Renu Desai) మరోసారి సోషల్ మీడియా పోస్టులపై సెటైర్లు వేశారు. దాదాపు 20ఏళ్ల తర్వాత ఆమె రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటించారు. ఇటివల ఓ జర్నలిస్టుతో ఇంటర్వ్యూలో ఆమె వ్యక్తిగత విషయాలపై మాట్లాడారు. ఆ విజువల్స్ ను నెట్టింట పోస్ట్ చేస్తూ సెటైర్స్ వేశారు.
‘అంకుల్.. మీరు నామీద వార్తలు రాస్తూ.. నా పేరు స్మరిస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. సంతోషం. ఇలా సంపాదించేకంటే.. మీదంటూ ఓ ప్రతిభతో డబ్బులు సంపాదిస్తే ఇంకా సంతోషిస్తా. దైవ నామస్మరణ చేయండి. మంచి పనులు చేయండి. సమాజంలో గౌరవం ఉంటుంది. ఇంత వయసొచ్చినా చెప్పించుకుంటున్నారంటే జాలేస్తోంది’.
‘నేనెప్పుడూ మిమ్మల్ని కలవలేదు. నా గురించి తెలీదు. కానీ.. నా ఇంటర్వ్యూలు ఇస్తూంటారు. దుర్మాదేవి, కాళిమాతలను మనం స్త్రీలుగా పూజిస్తాం. కానీ.. మగవారి తోడు లేకుండా మహిళలు ఏం చేయలేరనే మీ భావం. ఇలాంటి అపోహలు వీడండ’ని సుదీర్ఘ పోస్టు చేశారు. ఇందుకు నెటిజన్ల కామెంట్స్ నూ పోస్ట్ చేశారు.