Switch to English

రేణూ దేశాయ్ తప్పు తెలుసుకుని నాలుక్కరుచుకుంది

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి విడిపోయినప్పటికీ, రేణూ దేశాయ్ ని పవర్ స్టార్ ఫ్యాన్స్ వదులుకోలేదు. కొంతమంది ఆమెను వదినమ్మగానే చూసుకుంటుండగా.. మరికొంతమంది మాత్రం రేణును విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. పవన్ మరో పెళ్లి చేసుకున్నా, ఆమె మాత్రం మరొకిరిని పెళ్లాడటానికి వీల్లేదని గట్టిగానే వార్నింగులు కూడా ఇచ్చారు. దీంతో ఆమె తనకు కాబోయే వ్యక్తి వివరాలు చెప్పడానికి కూడా భయపడ్డారు.

మా నిశ్చితార్థం అయిపోయిందంటూ అప్పుడెప్పుడో వెల్లడించిన రేణూ.. ఆ తర్వాత దానికి సంబంధించిన ఏ విషయాన్ని బయటకు చెప్పలేదు. పెళ్లి అయిందో లేదో కూడా తెలియనీయకుండా జాగ్రత్తపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల తన కుమార్తె ఆద్యను కుమారుడు అకీరా ఎత్తుకుని ముద్దాడుతున్నఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేశారు. దీనికి పవన్ అభిమాని ఒకరు ‘ఎంతైనా పవన్ రక్తం కదా’ అని కామెంట్ చేశారు. దీనిని అంతటితో వదిలేస్తే సరిపోయేదానికి రేణూ తీవ్రంగా స్పందించారు. ‘పవన్ రక్తం ఏమిటి? టెక్నికల్ గా చూస్తే వారిద్దరిలో ప్రవహించేది నా రక్తం. నీకు సైన్స్ తెలిస్తే దీనికి అర్థం తెలుస్తుంది’ అంటూ స్పందించారు.

దీంతో పవన్ ఫ్యాన్స్ మరింత రెచ్చిపోయారు. వారిద్దరూ పవన్ బిడ్డలు కాకపోతే ఎవరి బిడ్డలు అంటూ ప్రశ్నలు గుప్పించారు. దీంతో రేణూకి తన తప్పు తెలిసొచ్చింది. తన వ్యాఖ్యలు తప్పుడు అర్థానికి దారి తీసేలా ఉన్నాయని భావించి.. వెంటనే ఆద్య, పవన్ కలిసి ఉన్న ఫొటోను పోస్టు చేశారు. ‘ఆద్య కొన్నిసార్లు నాలా అనిపిస్తుంది. చాలాసార్లు నానమ్మ, నాన్నకు ప్రతిరూపంలా కనిపిస్తుంది’ అని పేర్కొన్నారు. ఇలా ఈ వివాదానికి ముగింపు పలకడానికి ప్రయత్నించారు.

వాస్తవానికి పవన్, రేణూ విడిపోయి ఎవరికి వారు జీవిస్తున్నారు. తండ్రిగా పిల్లల బాధ్యత పవన్ పై ఎలాగూ ఉంటుంది. ఈ నేపథ్యంలో వారిద్దరినీ ఇలా సోషల్ మీడియాలోకి తీసుకొచ్చి ఇబ్బందులు ఎదుర్కోవడం ఎందుకని రేణూకి పలువురు సూచిస్తున్నారు. ఇలాంటి అంశాల్లో ఇకనైనా జాగ్రత్తగా ఉండాలని హితవు పలుకుతున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...