ప్రముఖ పారిశ్రామికవేత్త మహింద్రా సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రాను కలుసుకోవడం సంతోషంగా ఉందని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ అన్నారు. హైదరాబాద్ లో ఫార్ములా-ఈ చాంపియన్ షిప్ జరుగుతున్న నేపథ్యంలో ఆయన్ను కలుసుకున్నారు. నగరంలోని హైటెక్ సిటీలోని టెక్ మహీంద్రా ఇన్ఫో సిటీ క్యాంపస్ లో మహీంద్రా ఈ-రేసింగ్ జనరేషన్-త్రీ కారు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, హీరో రామ్ చరణ్ తో కలిసి ఆనంద్ మహీంద్రా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంపై రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా తన అనుభవాన్ని పంచుకున్నారు. నగరంలో జరుగుతున్న ఫార్ములా-ఈ రేసింగ్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. దీని ద్వారా ప్రపంచం అంతా హైదరాబాద్ వైపు చూసేలా చేసిన మంత్రి కేటీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాతోపాటు కంపెనీ సీఈఓ, ఎండీ సి.పి. గుర్నానీని కలుసుకోవడం కూడా సంతోషంగా ఉందని అన్నారు. ప్రత్యేకంగా నిర్మించిన స్ట్రీట్ సర్క్యూట్ పై రేసులు జరుగుతున్నాయి.
274221 493012Id always want to be update on new content material on this site , saved to fav! . 24129