సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్య కారణంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయిన విషయం తెల్సిందే. ఆయన ఆసుపత్రిలో జాయిన్ అవ్వడంతో కొన్ని మీడియా సంస్థలు కరోనా పాజిటివ్ అంటూ రాసి పడేశాయి. దాంతో వెంటనే అపోలో వారు హెల్త్ బులిటెన్ ను విడుదల చేయడం జరిగింది. ఆయన హై బీపీతో మాత్రమే ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అంతే తప్ప ఆయనకు కరోనా లక్షణాలు ఏమీ లేవన్నారు. ఇదే సమయంలో ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు కూడా క్లారిటీ ఇచ్చారు.
రజినీకాంత్ ఆసుపత్రిలో జాయిన్ అయిన రెండవ రోజు అయిన నేటి పరిస్థితి గురించి వైధ్యులు హెల్త్ బులిటెన్ ను విడుదల చేయడం జరిగింది. రజినీకాంత్ ను ఇంకా క్లోజ్ గా మానిటరింగ్ చేస్తున్నాం. ఆయన ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన లేదు. ఆయన బీపీ లెవల్స్ ను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. ఆయన్ను నేడు సాయంత్రం వరకు డిశ్చార్జ్ చేసే అవకాశం ఉన్నట్లుగా బులిటెన్ లో పేర్కొన్నారు.