Switch to English

రాజస్థాన్ రాజకీయం: గవర్నర్ తో గెహ్లాట్ ఢీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

రాజస్థాన్ లో రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. మొన్నటి వరకు గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్ గా సాగిన పరిణామాలు ప్రస్తుతం గవర్నర్ వర్సెస్ గెహ్లాట్ గా మారాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు గవర్నర్ కల్ రాజ్ మిశ్రా వెనకాడుతున్నారని, ఆయనపై ఢిల్లీ నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉందని సీఎం గెహ్లాట్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రజలు రాజ్ భవన్ ను ముట్టడిస్తే తమకు ఎలాంటి సంబంధం ఉండదని హెచ్చరించడం గమనార్హం.

సచిన్ పైలట్ సహా అసమ్మతి వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలంటూ రాజస్థాన్ హైకోర్టు తాజాగా ఆదేశాలిచ్చిన నేపథ్యంలో గెహ్లాట్ ప్లాన్ బి కి శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. వెంటనే అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి బలం నిరూపించుకోవాలని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన సంఖ్యాబలం తనకు ఉండటంతో సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తిచేసి తానేంటో చూపించాలనే పట్టుదలతో ఉన్నారు.

తొలుత అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలంటూ అటు సచిన్ పైలట్, ఇటు బీజేపీ డిమాండ్ చేసినప్పుడు స్పందించని గెహ్లాట్.. అసమ్మతి వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించడానికే మొగ్గు చూపారు. 200 మంది సభ్యుల గల రాజస్థాన్ అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 101. అసమ్మతికి ముందు మిత్రపక్షాలు, స్వతంత్రులతో కలుపుకొని కాంగ్రెస్ బలం 122 ఉండేది. 19 మంది తిరుగుబాటు తర్వాత అది 103కి చేరింది. అయితే, సచిన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వస్తే.. మ్యాజిక్ ఫిగర్ కూడా తగ్గిపోయి, కాంగ్రెస్ సునాయాస విజయం సాధిస్తుంది. ఈ నేపథ్యంలోనే అనర్హత దిశగా పావులు కదిపారు. అయితే, దీనిపై కోర్టు యథాతథ స్థితి కొనసాగించాలని తాజాగా ఆదేశించడంతో బలపరీక్ష నిర్వహించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుతం తమకు సరిపడా మెజార్టీ ఉందని.. అంతేకాకుండా ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో సచిన్ వర్గంలోని పలువురు వెనక్కి వచ్చే అవకాశం ఉందని గెహ్లాట్ భావిస్తున్నారు. వారిని బలవంతంగా నిర్బంధించారని ఆరోపించారు. సోమవారం సభ ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికే గవర్నర్ ను కలిసి విన్నవించారు. అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరిగి సభ సమావేశమైతే బలం నిరూపించుకోవాలని.. ఆ ప్రక్రియ పూర్తయితే మరో ఆరు నెలల వరకు విశ్వాస పరీక్ష నిర్వహించే అవకాశం ఉండదని.. ఆలోగా అసమ్మతి వర్గాన్ని దారికి తెచ్చుకోవడమో లేక వేటు వేయడం ద్వారా చెక్ చెప్పడమో చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి రాజస్థాన్ రాజకీయ బంతి ప్రస్తుతం గవర్నర్ కోర్టులోకి చేరింది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...