చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో 216 అడుగుల ఎత్తైన సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని ఇటివల భారత ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాదులో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీగా పిలిచే ఈ విగ్రహంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ విగ్రహం చైనాలో తయారు చేయించడంతో ప్రధాని మోదీని పరోక్షంగా ప్రస్తావిస్తూ విమర్శించారు. ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ని చైనాలో తయారు చేశారు. నవ భారత్ అంటే ‘చైనా – నిర్భరేనా..?’ అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.
‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ని చైనాలోని ఏరోసన్ కార్పొరేషన్ సంస్థ తయారు చేసింది. 2015లోలో ఆ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. విగ్రహం ప్రధాన వర్క్ చైనాలో పూర్తి చేసి.. 1600 విడి భాగాలుగా భారత్ కు తీసుకొచ్చారు. అనంతరం 15 నెలలు శ్రమించి విడి భాగాలను లేయర్లుగా అతికించారు. పంచలోహాలతో ఈ విగ్రహాన్ని పూర్తిగా తయారు చేశారు. ప్రపంచంలోనే కూర్చుని ఉన్న విగ్రహాల్లో రెండో అతిపెద్ద విగ్రహం కావడం విశేషం.
47496 455017In todays news reporting clever journalists function their own slant into a story. Bloggers use it promote their works and several just use it for fun or to stay in touch with friends far away. 110007