తగ్గేదే లేదంటున్నారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. నడవడానికి వీల్లేని పరిస్థితుల్లో వున్నా.. బెయిల్ షరతులతో నోరు కుట్టేసుకోవాల్సి వచ్చినా.. రఘురామ తన పని తాను చేసుకుపోతున్నారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేకపోతున్న రఘురామ, ప్రజా ప్రతినిథిగా.. ఓ పౌరుడిగా తనకున్న ఏ అవకాశాన్నీ వదులుకోవడంలేదు. తాజాగా, ఆర్మీ ఆసుపత్రి రిజిస్ట్రార్ మీదనే కేంద్ర రక్షణ మంత్రికి ఫిర్యాదు చేసి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు నర్సాపురం ఎంపీ.
రాజద్రోహం కేసులో అరెస్టయిన రఘురామ, ఏసీబీ కస్టడీలో వుండగానే దాడికి గురైన విషయం విదితమే. అసలు ఆ దాడి జరిగిందా.? లేదా.? అన్నదానిపై భిన్నవాదనలున్నాయిగానీ, ఆయన శరీరమ్మీద గాయాల్ని మాత్రం న్యాయస్థానాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య చికిత్స అందాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.
కొద్ది రోజులపాటు ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందిన రఘురామ, మరికొన్ని రోజులు అక్కడే చికిత్స పొందాలనుకున్నారు. కానీ, ఇంతలోనే ఏమయ్యిందో రఘురామని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేసేశారు. ఈ వ్యవహారంపై రఘురామకి అనుమానాలున్నాయి. ఆ అనుమానాల నేపథ్యంలోనే రక్షణ శాఖ మంత్రికి రఘురామ ఫిర్యాదు చేయడం గమనార్హం. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డిపైనా, టీటీడీ జేఈఓ ధర్మారెడ్డి, గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డిపై ఫిర్యాదు చేశారు రఘురామ.
తనను కుట్ర పూరితంగా ఆర్మీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారన్నది రఘురామ ఆరోపణ. డిఫెన్స్ అకౌంట్స్ అండ్ ఆడిట్ సర్వీస్ అధికారి కూడా అయిన టీటీడీ జేఈఓ ధర్మారెడ్డి డిప్యుటేషన్ మీద తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చారనీ, ఆ తర్వాత తనకు వ్యతిరేకంగా కుట్ర నడిచిందనీ రఘురామ ఆరోపిస్తున్నారు. ఏపీ పోలీస్ విభాగానికి చెందిన 15 మందికి చెల్లించిన మెస్ బిల్లుల్ని కూడా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కి చేసిన ఫిర్యాదు లేఖతో రఘురామ జత చేయడం గమనార్హం.
రఘురామ చేసింది సాదా సీదా ఆరోపణ కాదు. ఓ ఎంపీ అయి వుండీ, ఆయనేదో అడ్డగోలుగా ఆరోపణలు చేస్తారని అనుకోలేం. ఒకవేళ అలా అడ్డగోలు ఆరోపణలు చేస్తే, తీవ్రమైన పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వుంటుంది. ఇంతకీ, ఏం జరిగింది ఆర్మీ ఆసుపత్రిలో.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
14484 908723Hello there! Do you know if they make any plugins to protect against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any suggestions? 973559