Switch to English

బిగ్‌ స్టోరీ: రఫేల్‌ వచ్చేస్తోంది.. యుద్ధం తప్పదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

‘‘రఫేల్‌ యుద్ధ విమానాలు వుంటే.. పాకిస్తాన్‌కి అసలు సిసలు ‘దెబ్బ’ కొట్టి చూపించేవాళ్ళం..’’ అంటూ కొన్నాళ్ళ క్రితం సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఓ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. యురీ, పుల్వామా ఘటనల తర్వాత పాకిస్తాన్‌ని ‘దెబ్బ తీయాలనే’ కసి సగటు భారతీయుడిలో మరింత పెరిగిందన్నది నిర్వివాదాంశం. సర్జికల్‌ స్ట్రైక్స్‌ ద్వారా పాకిస్తాన్‌ని దెబ్బకొట్టగలిగినా.. అది ‘చావు దెబ్బ’ అయితే కాదు.

ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన రఫేల్‌ యుద్ధ విమానాల్ని భారత్‌ తీసుకొస్తోంది. ఫ్రాన్స్‌ నుంచి మొత్తం ఐదు రఫేల్‌ యుద్ధ విమానాలు బయల్దేరగా, వీటిల్లో రెండు శిక్షణ విమానాలు కాగా, మిగతావి పూర్తి యుద్ధతంత్రం కోసం వినియోగించేవి. వీటితోపాటు ఇంకో రఫేల్‌ విమానం ఇప్పటికే ఇండియాకి చేరుకుంది ఫ్రాన్స్‌ నుంచి. గత కొద్ది రోజులుగా భారత్‌ – చైనా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారిపోయాయి. గల్వాన్‌ లోయలో భారత సైనికులపై చైనా సైనికుల మారణ కాండ నేపథ్యంలో చైనాకి భారత్‌ సత్తా చూపించాల్సిందేనని కేంద్రంలోని మోడీ సర్కార్‌ పట్టుదలతో వున్నట్లు కన్పిస్తోంది.

కానీ, చైనాతో భారత్‌ పూర్తిస్థాయి యుద్ధం వస్తే.. యుద్ధ రంగాన నిలబడగలుగుతుందా.? అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వున్నాయి. ఇప్పటికే చైనా సరిహద్దుల్లో భారత వాయుసేనకు చెందిన పోరాట విమానాలు, హెలికాప్టర్లను మోహరించడం జరిగింది. ఇవన్నీ శతృదేశానికి మన సత్తా చూపించేందుకే. అయితే, వీటితో ఇప్పటికిప్పుడు యుద్ధం చేసేస్తామని చెప్పడానికి వీల్లేని పరిస్థితి. ముందస్తుగా భారతదేశం ఏ దేశమ్మీదా దాడి చేయదు. ఇది భారత్‌ తనంతట తాను విధించుకున్న స్వీయ నిబంధన.

అయితే, కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్నప్పటికీ, రికార్డు సమయంలో రఫేల్‌ యుద్ధ విమానాల్ని ఫ్రాన్స్‌ నుంచి రప్పించడమంటే ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా కొట్టి పారేయడానికి వీల్లేదు. చైనా సంగతి పక్కన పెడితే, దాయాది పాకిస్తాన్‌ మళ్ళీ రెచ్చిపోతోంది. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్‌ని చావు దెబ్బ తీస్తే, చైనా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుంటుందనీ, తద్వారా యుద్ధం చేయకుండానే చైనాని అదుపులో పెట్టవచ్చనీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఏదిఏమైనా.. యుద్ధమంటే ఆషామాషీ వ్యవహారం కానే కాదు. పైగా, పాకిస్తాన్‌ మీదకు భారత్‌ వెళితే.. చైనా రెచ్చిపోయే అవకాశాలెక్కువ. చైనాతో పంచాయితీ పెట్టుకున్నా, పాక్‌ నుంచీ ముప్పు తప్పదు. సో, ఏకకాలంలో రెండు దేశాలతో భారత్‌ యుద్ధం చేయాల్సి రావొచ్చు. అందుకే.. సరిహద్దులో సర్వసన్నద్ధంగా వుండేందుకే.. ఈ ఏర్పాట్లు.. అన్నది రఫేల్‌ రాకపై రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...