Switch to English

ప్రశాంత్ కిశోర్‌కీ వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికీ ఎక్కడ చెడింది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్త పాపులారిటీ సంపాదించుకున్న ‘ఐ-ప్యాక్’ టీమ్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్, 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి విశేష సేవలు అందించిన విషయం విదితమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా పనిచేశాడాయన అప్పట్లో. ఆయన అనుకున్నది సాధించేశాడు కూడా.!

పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ కోసం కూడా ఆయన పని చేశాడు. చాలా రాష్ట్రాల్లో ప్రశాంత్ కిశోర్ టీమ్, అక్కడి రాజకీయ పార్టీల తరఫున వ్యూహాత్మకంగా పని చేసి, ఆయా రాజకీయ పార్టీల్ని గద్దెనెక్కించడం చూశాం.

ప్రశాంత్ కిశోర్ సమర్థత ఏంటి? అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్రమమో, సక్రమమో.. తీసుకున్న సొమ్ములకి న్యాయం చేయడం అతని లక్ష్యం. వందల కోట్లలో కాదు, అంతకు మించిన రీతిలో అతని ఫీజు వుంటుందనేది అంతటా వినిపించేమాట.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా, ప్రశాంత్ కిశోర్‌కి గట్టిగానే సమర్పించుకోవాల్సి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఒకప్పుడు ఇదే ప్రశాంత్ కిశోర్‌ని తీవ్రవాదిగా అభివర్ణించడం చూశాం. అదే చంద్రబాబు, ప్రశాంత్ కిశోర్ ముందర మోకరిల్లినట్లే కనిపిస్తోంది.

ప్రశాంత్ కిశోర్, అప్పట్లో జగన్‌ని గెలిపించిన దరిమిలా, ఇప్పుడు చంద్రబాబుని గెలిపించేస్తారన్న ప్రచారం జోరందుకుంది. ఎవరైతేనేం, ఎక్కడ సొమ్ములు బాగా గిట్టుబాటు అయితే, అక్కడ పని చేయడం ప్రశాంత్ కిశోర్‌కి అలవాటు. అయినా, వైసీపీ కూడా గట్టిగానే ఇస్తుంది కదా.? ఎందుకు వైఎస్ జగన్‌కి ప్రశాంత్ కిశోర్ దూరమయినట్లు.?

వైఎస్ జగన్, ప్రశాంత్ కిషోర్ మధ్య ఎక్కడ చెడినట్టు.. అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో కేసీయార్ కోసం పని చేసిన ప్రశాంత్ కిశోర్, తెలంగాణలో గులాబీ పార్టీని ఇంకోసారి అధికారంలోకి తీసుకురాలేకపోయారు. నిజానికి, ముందుగానే గులాబీ పార్టీతో ప్రశాంత్ కిషోర్ (అంటే, ఎన్నికలకు ముందరగానే) తెగతెంపులు చేసుకున్నారనుకోండి.. అది వేరే సంగతి.

అయినాగానీ, తెలంగాణలో ప్రశాంత్ కిశోర్ పప్పులుడకలేదు గనుక, ఏపీలోనూ అదే పరిస్థితి అన్న నిర్ణయానికి వైఎస్ జగన్ వచ్చేశారన్నది ఓ వాదన. ఇంకోపక్క, నియోజకవర్గ ఇన్‌ఛార్జిల మార్పు విషయమై ప్రశాంత్ కిశోర్ సూచనల్ని జగన్ పెడ చెవిన పట్టారనీ, ఈ క్రమంలో ఇద్దరి మధ్యా గ్యాప్ పెరిగి వుండొచ్చనీ ఇంకో వాదన వినిపిస్తోంది.

కారణం ఏదైతేనేం.? ఒకప్పుడు ప్రశాంత్ కిశోర్ ప్రాపకం కోసం మోకరిల్లిన వైసీపీ నేతలంతా, ఇప్పుడు టీడీపీ కోసం పనిచేయనున్న ప్రశాంత్ కిశోర్‌ని తూలనాడుతున్నారు. అప్పట్లో ప్రశాంత్ కిశోర్‌ని తూలనాడిన టీడీపీ, ఇప్పుడాయన్ని నెత్తిన పెట్టుకుంది.

ఇంతకీ, ప్రశాంత్ కిశోర్ 2024 ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తారా.? ఆ అతి నమ్మకంతోనే జనసేనకు దూరమవ్వాలనే ఆలోచన టీడీపీ చేస్తోందా.? ఏమో, కాలమే సమాధానం చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...