ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ( Prashanth Kishore), తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu)తో భేటీ అయ్యారు. గత ఎన్నికల్లో ప్రశాంత్ వైసీపీ తరఫున కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. శనివారం మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగిన ఆయన లోకేష్ వాహనంలో బయలుదేరి చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
కొన్ని రోజుల క్రితం ఏపీలోని అధికార వైసిపి పార్టీపై ప్రశాంత్ కిషోర్ పరోక్షంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. గతంలో ఆయన ఎన్నో రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా పనిచేశారు. దాదాపు ఆ పార్టీలన్నీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ భేటీ పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.