యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సాహో సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా అటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. దాంతో పాటు జిల్ ఫేమ్ రాధాకృష్ణ తో జాన్ అనే సినిమాకూడా చేస్తున్నాడు. ఇప్పటికే హైదరాబాద్ లో వేసిన రోమ్ సెట్స్ లో షూటింగ్ జరుగుతుంది.
బాహుబలి కోసం ఏకంగా ఐదేళ్లు కేటాయించిన ప్రభాస్ ఇప్పుడు సాహో కోసం కూడా దాదాపు రెండేళ్లు కేటాయించడంతో అయన అభిమానులు ప్రభాస్ పై కాస్త గుస్సామీదున్నారు. వారిని కూల్ చేయడానికి ప్రభాస్ వరుస సినిమాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో ప్రభాస్ తాజాగా మరో సినిమాకు పచ్చజెండా ఊపినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ప్రముఖ నిర్మాత దిల్ రాజు తో చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడంతో మళ్ళీ ప్రభాస్ తో సినిమా చేయాలనీ దిల్ రాజు చాల ట్రై చేసాడు కానీ అది వర్కవుట్ కాలేదు.
ఇన్నాళ్లకు మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ సెట్ అయినట్టు సమాచారం. సాహో షూటింగ్ ఎలాగూ పూర్తయింది కాబట్టి ప్రస్తుతం జాన్ పై ఫోకస్ పెట్టిన ప్రభాస్ ఆగస్టు నుండి దిల్ రాజు సినిమా చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాలో అప్పుడే హీరోయిన్ ని కూడా ఫిక్స్ చేశారట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా .. టాలీవుడ్ టాప్ స్టార్ సమంత ? త్వరలోనే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
736241 600797Have read a couple of with the articles on your internet site now, and I genuinely like your style of blogging. I added it to my favorites blog website list and will probably be checking back soon. 205471
807007 736536I like this post, enjoyed this 1 appreciate it for putting up. 368413