తెలుగు దేశం పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించిన సాదినేని యామిని ఒక్కసారిగా ఏపీ రాజకీయాల్లో మెరిసింది. ఆమె ప్రతిపక్ష విపక్షాలపై ఏ స్థాయిలో విరుచుకు పడేదో చెప్పనక్కర్లేదు. తెలుగు దేశం పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన నేపథ్యంలో ఆమెపై ఎదురు దాడి ప్రారంభం అయ్యింది. దాంతో ఆమె టీడీపీని వీడి బీజేపీలో జాయిన్ అయిన విషయం తెల్సిందే. బీజేపీలో కాస్త తక్కువ కనిపిస్తున్న యామిని తాజాగా అయోధ్య రామ మందిర భూమి పూజ కార్యక్రమంను టీటీడీ ఛానెల్ లో ప్రసారం చేయక పోవడంపై విమర్శలు చేసింది. టీటీడీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆమె విమర్శలకు దిగింది.
సాదినేని యామిని చేసిన వ్యాఖ్యలపై టీటీడీ బోర్డు సీరియస్ అయ్యింది. ఆమెపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. పోలీసులు యామినిపై ఐపీసీ సెక్షన్ 505 మరియు 500 కింద కేసు నమోదు చేసినట్లుగా పేర్కొన్నారు. రామ మందిర భూమి పూజ ప్రత్యక్ష ప్రసారం విషయంలో ఇప్పటికే టీటీడీ పై విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇలాంటి సమయంలో యామిని పై కేసు నమోదు చేయడంతో అందరి నోళ్లు మూత పడుతాయని భావిస్తున్నారు. సోషల్ మీడియాలో యామిని చేస్తున్న ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలకు కూడా ఈ కేసుతో సమాధానం చెప్పినట్లుగా అనిపిస్తుందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
332758 766120You should be really astute at research and writing. This shows up within your original and distinctive content. I agree with your primary points on this subject. This content should be seen by a lot more readers. 112922
906333 956555I was suggested this website by my cousin. Im not positive whether this post is written by him as no 1 else know such detailed about my trouble. Youre fantastic! Thanks! xrumer 158094