Switch to English

లగడపాటి ముందే ఎందుకొచ్చినట్టు?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది. దేశవ్యాప్తంగా మిగిలిన స్థానాల్లో ఆదివారం తుది విడత పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిశాక సాయంత్రం 6 గంటల నుంచి మాత్రమే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాలని ఎన్నికల సంఘం నిబంధనలు స్పష్టంచేస్తున్నాయి. దీంతో జాతీయ, ప్రాంతీయ టీవీ ఛానళ్లు, సర్వే సంస్థలన్నీ ఆదివారం సాయంత్రం తమ తమ ఎగ్జిట్ పోల్ ఫలితాలను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అయితే, ఆంధ్రా ఆక్టోపస్, విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాత్రం అనూహ్యంగా ఒక్కరోజు ముందుగానే ప్రెస్ మీట్ పెట్టి తన సర్వే ఫలితాలు ఇవీ అంటూ వెల్లడించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

ఆదివారం సాయంత్రం తిరుపతిలో తన సర్వే వివరాలు వెల్లడిస్తానని చెప్పిన ఆయన.. తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో టీడీపీ గెలుపొందడం ఖాయమంటూ లీకులు ఇవ్వడానికి కారణం ఏమిటా అని పలువురు ఆరా తీస్తున్నారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా లగడపాటి ముందుగానే తన అంచనాలు ఇవీ అంటూ లీకులిచ్చారు. కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమిదే గెలుపు అని పోలింగ్ జరగడానికి ముందే ప్రకటించారు. దీనిపై అధికార టీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. లగడపాటి తనకు పంపిన సర్వే వివరాలు ఇవీ అంటూ వాట్సాప్ స్క్రీన్ షాట్ ను కేటీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తమ పార్టీని దెబ్బ తీసేందుకే లగడపాటి ఇలా అవాస్తవాలు చెబుతున్నారంటూ విమర్శించారు. పర్సనల్ చాట్ బయటపెట్టడం సబబు కాదని, కానీ లగడపాటి వల్ల తమ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉండటంతోనే తాను తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పని చేస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.

పోలింగ్ ముగిసిన తర్వాత సైతం లగడపాటి మహాకూటమిదే అధికారం అంటూ తన సర్వే ఫలితాలు వెల్లడించారు. అయితే, ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ దుందుభి మోగించడంతో లగడపాటి కొన్నాళ్లపాటు కనిపించలేదు. కేవలం బెట్టింగులను ప్రోత్సహించడానికి, తన సర్వే ఫలితాల ద్వారా బెట్టింగ్ లో కోట్ల రూపాయలు ఆర్జించాలనే కుట్రతోనే లగడపాటి ఇలా తప్పుడు సర్వే ఫలితాలు వెల్లడించారని అప్పట్లో విపరీతంగా విమర్శలు వచ్చాయి. అప్పటివరకు ఆయన చెప్పిన చాలా సర్వేలు నిజం కావడంతో లగడపాటి సర్వే కోసం జనం అంతా ఎదురుచూసే పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రోద్బలంతో లగడపాటి తప్పుడు సర్వే ఫలితాలు ప్రకటించారంటూ టీఆర్ఎస్ తోపాటు వైఎస్సార్ సీపీ కూడా విరుచుకుపడింది.

తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయంలోనూ లగడపాటి అలాగే వ్యవహరించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ముందుగా ప్రకటించినట్టుగానే ఏపీ ఫలితాలను కూడా ఒక్క రోజు ముందుగానే బయటపెట్టారు. ఇక్కడ కూడా బెట్టింగ్ లలో తనకు, తన వాళ్లకు లాభం చేకూర్చేందుకే లగడపాటి తప్పుడు సర్వే ఫలితాలు చెబుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే, తన ఫలితాలను ఆధారంగా చేసుకుని ఎవరూ బెట్టింగులు కట్టొద్దని కూడా ఆయన హెచ్చరించారు.

మరోవైపు చంద్రగిరి రీ పోలింగ్ పై ప్రభావం చూపించడానికే లగడపాటి ముందుగా ప్రకటన చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కేవలం 6వేల మంది ఓటర్లను ప్రభావితం చేయడానికి తన విశ్వసనీయతనే ఫణంగా పెడతారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈసారి తన ఫలితం తప్పితే ఇక ఎవరూ కూడా తనను నమ్మబోరని లగడపాటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ లెక్కన చూస్తే లగడపాటి చెప్పిందే నిజం కానుందా? ఏపీలో సైకిల్ జోరు చూపించనుందా అనే అంశాలపై జోరుగా చర్చ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం వెలువడే ఎగ్జిట్ ఫలితాలతో వీటన్నింటిపై కొంతమేరకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్స్ కూడా గందరగోళంగా ఉంటే ఇక ఈనెల 23 వరకు వేచిచూడక తప్పదు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...