తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో విద్యార్ధినులు బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారనే వార్తపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఆడబిడ్డలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు జనసేన పార్టీ తరపున ఓ ప్రకటన చేశారు.
విద్యార్ధుల కోసం బస్సు ఏర్పాటు చేయాలి. రంగారెడ్డి జిల్లాలోని పల్లెచెల్క తండా, సరికొండ గ్రామాల విద్యార్ధులు ఎదుర్కొన్న ఇబ్బందులు జనసేన దృష్టికి వచ్చాయి. ముఖ్యంగా ఆడబిడ్డలు మేడిపల్లి, మాల్, ఇబ్రహీంపట్నం వెళ్లి చదువుకుంటున్నారు. విద్యా సంస్థలు విడిచిపెట్టాక బస్సు సౌకర్యం లేక నడిచి వెళ్లాల్సి వస్తోంది. అటవీ ప్రాంతం కావడంతో విద్యార్ధులు భయాందోళనలకు గురవుతున్నారు.
బస్సు సౌకర్యం ఉన్నా సరిగా నడపకపోవడంతో పిల్లలు బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం సమస్యపై స్పందించి బస్సు నడపాలి. బస్సు సౌకర్యం లేకో, భయపడో విద్యార్ధినులు చదువు మధ్యలో ఆపేసే పరిస్థితులు రాకూడదు’ అని ట్వీట్ లో పేర్కొన్నారు. సమస్యను మంత్రి కేటీఆర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, తెలంగాణ సీఎంఓ, టీఎస్ఆర్టీసీలకు ట్యాగ్ చేశారు.
— Pawan Kalyan (@PawanKalyan) October 12, 2022
విద్యార్థుల కోసం బస్సు ఏర్పాటు చేయాలి..
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలోని పల్లెచెల్క తండా, సరికొండ గ్రామాల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు జనసేన దృష్టికి వచ్చాయి. ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి.. ముఖ్యంగా ఆడబిడ్డలు ..
Sri @SajjanarVC @KTRoffice @TelanganaCMO @tsrtcmdoffice pic.twitter.com/ZRrnXTpLeg— Pawan Kalyan (@PawanKalyan) October 12, 2022