కొన్నాళ్ళ క్రితం విశాఖ వెళ్ళారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. బస చేసిన హోటల్ నుంచి పవన్ కళ్యాణ్ బయటకు రాకుండా నిర్బంధించారు విశాఖ పోలీసులు. అంతకు ముందు ఆయన విమానాశ్రయం నుంచి నోవాటెల్ వరకూ రోడ్ షో చేయడం, మరోపక్క విశాఖ విమానాశ్రయంలో మంత్రులపై జనసేన కార్యకర్తలు హత్యాయత్నం చేశారంటూ ఆరోపణలు రావడం తెలిసిన వ్యవహారాలే.
కానీ, ఇప్పుడు సీన్ మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ వెళ్ళారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు విశాఖ వెళ్ళిన జనసేనాని, ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. పది నిమిషాలపాటు అనుకున్న భేటీ కాస్తా, 35 నిమిషాల వరకు జరిగింది.
రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, బీజేపీ – జనసేన మధ్య పొత్తుకి సంబంధించి ఏర్పడ్డ కమ్యూనికేషన్ గ్యాప్ సహా పలు కీలక అంశాలపై ప్రధాని మోడీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య చర్చలు జరిగాయి.
కాగా, విశాఖ చేరుకున్న జనసేనానికి విశాఖ పోలీసులు ప్రత్యేక భద్రత కల్పించారు. విమానాశ్రయం నుంచి నోవోటెల్ వరకూ.. నోవోటెల్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ బస చేసిన ప్రాంతం వరకు.. పోలీసులు, జనసేన అధినేతకు భద్రతగా వెళ్ళడం చర్చనీయాంశంగా మారింది.
ఇదే విశాఖ పోలీసులు, పవన్ కళ్యాణ్ ర్యాలీ సందర్భంగా గతంలో ‘వాహనం మీద నుంచి దిగాలి.. ఎవరికీ అభివాదం చేయకూడదు..’ అంటూ గదమాయించిన సంగతి తెలిసిందే. ఆనాటి ఆ పరిస్థితుల్నీ.. ఇప్పుడు జనసేనానికి విశాఖ పోలీసులు ఇస్తున్న ప్రత్యేక మర్యాదనీ పేర్కొంటూ జనసైనికులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.
కాగా, ప్రధాని రాక నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా విశాఖలోనే వున్నారు. విశాఖ విమానాశ్రయంలో ప్రధాని మోడీకి సీఎం జగన్ సహా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోడీ విశాఖలో రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా పాల్గొన్నారు.
428641 249883Some genuinely excellent information , Gladiola I observed this. 709175
943361 546973Generally the New york Weight Loss diet is definitely less expensive and flexible staying on your diet scheme intended for measures however rapidly then duty keep a nutritious everyday life. weight loss 434895