ఏపీలో జరుగబోతున్న పరిషత్ ఎన్నికలను బహిష్కరించబోతున్నట్లుగా చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయంను కొందరు పార్టీ సీనియర్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు గెలుపు ఓటముల గురించి పట్టించుకోకుండా ప్రజాస్వామ్యంపై నమ్మకంతో ఎన్నికల్లో పోటీ చేయాలి. అప్పుడే ప్రజలు మనల్ని నమ్ముతారు అంటూ సీనియర్ నేతలు చంద్రబాబును ఉద్దేశించి అంటున్నారు.
పార్టీ సీనియర్ నాయకుడు అయిన అశోక్ గజపతి రాజు ఇప్పటికే చంద్రబాబు నాయుడు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా ప్రకటించాడు. తాజాగా ఆయన కూతురు అదితి స్పందిస్తూ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. పార్టీ నాయకులు మరియు కార్యకర్తల అభిష్టం మేరకు తాము పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతాం అంటూ ఆమె పేర్కొన్నారు. ఇంకా పలువురు నాయకులు కూడా చంద్రబాబు నాయుడు తీరును తప్పుబడుతున్న విషయం తెల్సిందే.
589019 802106Youre so cool! I dont suppose Ive learn something like this before. So very good to search out any person with some special thoughts on this topic. realy thanks for starting this up. this website is 1 thing thats wanted on the net, somebody with a bit originality. useful job for bringing one thing new towards the internet! 665927
760823 430441You made some respectable points there. I looked on the internet for the issue and found a lot of people will go along with together with your internet site. 838754