కొన్ని రోజుల క్రితం గీత గోవిందం దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా 14 రీల్స్ నిర్మాతలు ఒక సినిమాను నిర్మించబోతున్నట్లుగా ఒక ప్రకటన చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం చైతూ చేస్తున్న లవ్ స్టోరీ పూర్తి అయిన వెంటనే పరశురామ్ దర్శకత్వంలో మూవీ ఉంటుందని అంతా అనుకున్నారు. కాని సినిమా షూటింగ్ మొదలు కావాల్సిన సమయంలో అనూహ్యంగా పరశురామ్కు మహేష్బాబు నుండి పిలుపు రావడంతో చైతూ మూవీ పక్కకు పెట్టేశారని వార్తలు వస్తున్నాయి.
పరశురామ్ ప్రస్తుతం మహేష్బాబు 27వ చిత్రం స్క్రిప్ట్ పనుల్లో ఉన్నాడని తెలుస్తోంది. తాజాగా దర్శకుడు పరశురామ్తో మీడియా ప్రతినిధి మాట్లాడిన సమయంలో నాగచైతన్య మూవీ విషయం ఏంటీ అంటూ ప్రశ్నించగా తప్పకుండా నాగచైతన్యతో మూవీ ఉంటుందని పేర్కొన్నాడు. అయితే అది ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అలాగే ఆయన మహేష్బాబు సినిమా చేస్తున్నట్లుగా కూడా కన్ఫర్మ్ చేయడంలేదు.
స్క్రిప్ట్కు మహేష్బాబు ఓకే చెప్పిన తర్వాతే పరశురామ్ సినిమా విషయాన్ని క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మహేష్బాబు స్క్రిప్ట్ ఓకే చేస్తే వెంటనే ఆయనతో పరశురామ్ సినిమా మొదలు పెడతాడట. లేదంటే నాగచైతన్యతోనే సినిమా ఉంటుందని సినీ వర్గాల వారు అంటున్నారు. మహేష్బాబుతో పరశురామ్ సినిమాను కూడా 14 రీల్స్ వారే నిర్మించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
231045 39071I feel this web site contains some extremely great information for everybody : D. 105871
868042 238114Hey! Do you use Twitter? Id like to follow you if that would be ok. Im surely enjoying your blog and look forward to new updates. 446069
458839 242662Aw, i thought this was quite a good post. In concept I would like to devote writing such as this moreover – spending time and actual effort to produce a fantastic article but exactly what do I say I procrastinate alot by no means manage to get something done. 529384