ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని రోజుల క్రితమే ఒక తెలుగు దేశం పార్టీ నాయకుడిని హత్య చేయడం జరిగింది. ఆ కేసు విచారణ జరుగుతుంది. ఈ సమయంలోనే మరో తెలుగు దేశం పార్టీ నేత హత్య కలకలం రేపుతోంది. తెలుగు దేశం పార్టీలో కీలక నాయకుడిగా ఉన్న గుంటూరు జిల్లాకు చెందిన పురంశెట్టి అంకులు ను గుర్తు తెలియన వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్ అయిన అంకులు ఫోన్ కాల్ రావడంతో దాచేపల్లిలోని ఒక నిర్మాణంలో ఉన్న అపార్ట్ మెంట్ లోకి వెళ్లాడు.
కారులో అపార్ట్మెంట్ వరకు వెళ్లిన అంకులు పైకి ఒక్కడే వెళ్లాడు. ఎంత సమయం అయినా రాక పోవడంతో డ్రైవర్ అనుమానంతో పైకి వెళ్లి చూడగా మృతి చెంది ఉన్నాడు. విషయం తెలిసిన గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు. అధికార వైకాపా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, ఇతర వైకాపా నాయకులు మరియు పోలీసుల ప్రోద్బలంతోనే అంకులును హత్య చేశారు అంటూ ఆరోపించారు. నేడు దాచేపల్లికి తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ రాబోతున్నట్లుగా యరపతినేని అన్నారు. వైకాపా నాయకులు అధికారం చేతిలో ఉంది కదా అని హత్యలకు పాల్పడుతున్నారు అంటూ టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
563760 710874This really is genuinely interesting, You are a really skilled blogger. Ive joined your rss feed and appear forward to seeking a lot more of your magnificent post. Also, Ive shared your web site in my social networks! 459862
659498 438737Magnificent beat ! I would like to apprentice whilst you amend your web site, how could i subscribe for a weblog web site? The account helped me a appropriate deal. I had been just a little bit acquainted of this your broadcast provided brilliant transparent notion 590912