విశాఖలో గ్యాస్ లీక్ తర్వాత రాష్ట్రంలో వరుస అగ్ని ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఈ ఘటనలను మరువక ముందే మరో అగ్ని ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు మండలం బందపల్లిలోని హట్ సన్ పాల డెయిరీలో అమ్మోనియం గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూతలపట్టు మండలం బండపల్లి సమీపంలోని ఉన్న డెయిరీలో ఈ ఘటన జరిగింది.
ఈ ఘటనలో అస్వస్థతకు గురైనవారిలో 12 మంది మహిళలు ఉన్నారు. చికిత్స తీసుకుంటున్న వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద ఘటన తెలుసుకున్న వెంటనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. ప్రమాద విషయమై ఆరా తీశారు. సంఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ్ భరత్ గుప్తా, ఎస్పీ సెంథిల్ కుమార్ పరిశీలించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు.
891226 91349Great web site. Lots of useful info here. 209899
250062 702369Its wonderful what supplementing can do for your body and your weight lifting goals! 631175