శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి 10:30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. శ్రీశైలం ఎడమగట్టు నాలుగో టెర్మినల్ లో ఒక్కసారిగా భారీ శబ్దాలతో మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదంతో మొత్తం ఆరు యూనిట్లలో దట్టంగా పొగలు కమ్మేశాయి. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్ లో 30 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 15 మంది సొరంగమార్గం గూండా తప్పించుకున్నారు. సహాయక సిబ్బంది మరో ఆరుగురిని రక్షించారు. ఆ సమయంలో మరో తొమ్మిది మంది అక్కడే చిక్కుకుపోయారు.
ప్రమాదం జరిగిన వెంటనే డీఈ పవన్ కుమార్ తోసహా సిబ్బంది బయటకు పరుగులు తీశారు. సిబ్బంది అప్రమత్తమై వెంటనే విద్యుత్ సరఫరాలు నిలిపివేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు వ్యాపించడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. దీంతో తెల్లవారుఝామున మంటలు అదుపులోకి వచ్చాయి. మిగిలిన వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన డిఈ పవన్ కుమార్, ప్లాంట్ జూనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, తదితరులను ఈటలపెంట జెన్ కో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాద విషయం తెలుసుకున్న తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి, కలెక్టర్ శర్వణ్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తదితరులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జల విద్యుత్ కేంద్రంలో చిక్కుకున్న 9 మందిని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ప్లాంట్ లో షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
🔹#Srisailam ఎడమ జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం
🔹 ప్రమాద సమయంలో విద్కుత్ కేంద్రంలో 17 మంది ,8 మందిని కాపాడిన రెస్క్యూ సిబ్బందిని కాపాడారు
🔹మరో 9 మందిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు#Telangana #SrisailamFireAccident #AndhraPradesh pic.twitter.com/5QE652sDhQ
— TeluguBulletin.com (@TeluguBulletin) August 21, 2020