ప్రముఖ దర్శకుడు శంకర్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. చెన్నై లోని ఎగ్మోర్ మెట్రోపాలిటన్ కోర్టు ఆయనపై ఈ వారెంట్ జారీ చేసింది. రోబో సినిమా కథ తనదేనని, తాను రచించిన ‘జిగుబా’ అనే కథను శంకర్ కాపీ కొట్టి రోబో సినిమా తీశారని ప్రముఖ రచయిత అరుర్ తమిళ్ నందన్ గతంలో కోర్టుకు వెళ్లారు. ఈ వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం శంకర్ ను ఆదేశించింది. అయినా ఆయన కోర్టుకు రాలేదు.
న్యాయస్థానం పలుమార్లు ఆదేశించినా శంకర్ పట్టించుకోలేదు. దీంతో కోర్టు తాజాగా శంకర్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. అరుర్ రచించిన జిగుబా కథ 1996లోనే ఓ మేగజీన్ లో ప్రచురితమైంది. ఆ కథనే 2007లో నవలగా కూడా ముద్రించారు. దానిని ఆధారంగానే చేసుకునే శంకర్.. రోబో చిత్రం తీశారని పేర్కొంటూ 2010లో అరుర్ కోర్టుకు వెళ్లారు.
272221 642768I gotta bookmark this internet site it seems really beneficial very helpful 646195
887149 438703The posh distributed could be described as distinctive; customers are really yearning for bags can be a Native aspirations. Which strange surroundings is built that is to market diversity furthermore importance with travel and leisure market trends. hotels special offers 119620