Switch to English

జనసేన అమ్ములపొదిలో మరో ‘అస్త్రం’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

రాజకీయ రంగంలో సరికొత్త మార్పు కోసం సినీ నటుడు పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీని స్థాపించి జనంలోకి వెళ్ళిన విషయం విదితమే. 2014లో ప్రారంభమైన జనసేన పార్టీ, ఇటీవలి ఎన్నికల్లో ఆశించిన రీతిలో ఫలితాలు సాధించలేకపోయినా, డబ్బుతో సంబంధం లేకుండా రాజకీయాలు చేయవచ్చునని నిరూపించింది. మార్పు కోసం పాతికేళ్ళ పోరాటం.. అనే అద్భుతమైన ఎజెండా పెట్టుకున్న జనసేన పార్టీ, రానున్న రోజుల్లో పార్టీ పని తీరు ఎలా వుండాలన్నదానిపై పార్టీ ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించింది.

పవన్‌కళ్యాణ్‌ నేతృత్వంలో పార్టీ ముఖ్య నేతలంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ క్రమంలో పార్టీ కోసం ఓ పత్రిక ఖచ్చితంగా వుండాలనే అభిప్రాయం వ్యక్తమయ్యింది. వాస్తవానికి ఈ ఆలోచన గత కొన్నేళ్ళుగా జనసేనలో విన్పిస్తూనే వుంది. జనసేన తరఫున పక్ష పత్రిక ప్రారంభించనున్నట్లు తాజాగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వెల్లడించారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేత హరిప్రసాద్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజా సమస్యల్ని వెలుగులోకి తీసుకురావడం, ప్రస్తుత రాజకీయాలపై మేధావులు, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు, దేశ విదేశాలకు సంబంధించిన పాలసీ నిర్ణయాలు, సంక్షేమం – అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఈ పత్రికలో ప్రచురితమవుతాయి. సెప్టెంబర్‌లో తొలి పత్రిక రాబోతోంది. ప్రింట్‌ వెర్షన్‌ అలాగే, ఈ-వెర్షన్‌ పత్రిక కూడా అందుబాటులో వుంటుంది.

మరోపక్క, ఇటీవలి ఎన్నికలు – ఫలితాల గురించి పార్టీలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఈ రోజు పలు జిల్లాలకు చెందిన నేతలు, కార్యకర్తలు, అభ్యర్థులతో స్వయంగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ మాట్లాడారు. ఈ సమావేశంలో పవన్‌ కళ్యాణ్‌ సోదరుడు, నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి నాగబాబు కూడా పాల్గొన్నారు. ఇదిలా వుంటే, పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తోన్న కార్యకర్తలు, ముఖ్యంగా మెగా ఫ్యాన్స్‌ విషయంలో నాగబాబు ఇకపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నట్లు తెలుస్తోంది. అభిమానుల్ని పార్టీ కార్యకర్తలుగా, జనసైనికులుగా మలచే బాధ్యతను నాగబాబుపై పవన్‌కళ్యాణ్‌ వుంచారని సమాచారమ్‌. వీలు చిక్కినప్పుడల్లా రాష్ట్రమంతటా పర్యటించి, అభిమానులతో నాగబాబు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తారట. అదే విధంగా తెలంగాణలోనూ పార్టీ విస్తరణపై అంతర్గతంగా పార్టీలో చర్చ జరుగుతోంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

రాజకీయం

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎక్కువ చదివినవి

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...