పవన్ కళ్యాణ్ కరోనా తో బాధపడుతున్న నేపథ్యంలో ఒక అభిమాని వివేకానంద మరియు చెగువేరా లు వచ్చి పవన్ ను పరామర్శిస్తున్నట్లుగా అర్థం వచ్చేలా ఒక ఫొటోను చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ ఫొటో బాగా వైరల్ అయ్యింది. దానికి హేతువాది అయిన బాబు గోగినేని స్పందిస్తూ 39 ఏళ్లకే చనిపోయిన వివేకానంద అదే వయసులో చంపబడ్డ చెగువేరా లు 49 ఏళ్ల యువ హీరోను పరామర్శించేందుకు రావడం చాలా స్ఫూర్తి దాయకం అంటూ పేర్కొన్నాడు. బాబు గోగినేని వ్యాఖ్యలకు నాగబాబు సీరియస్ అయ్యాడు. అవాకులు చవాకులు మాట్లాడే ఊర కుక్కలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
నాగబాబు చేసిన వ్యాఖ్యలకు బాబు గోగినేని స్పందిస్తూ.. మహాత్మగాంధీని చంపిన వ్యక్తిని దేశ భక్తుడు అంటున్న దుష్టుడి చుట్టు మనుషులు కాకుండా ఊర కుక్కలు మాత్రమే ఉంటాయంటూ బాబు గోగినేని వ్యాఖ్యలు చేశాడు. వీరిద్దరి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అయిన నేపథ్యంలో కామెంట్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. కొందరు బాబు గోగినేనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. హేతువాది అంటూ చెప్పుకుంటున్న బాబు గోగినేని కుల పిచ్చి ఉన్న వ్యక్తి అంటూ ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికి ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది.
270350 93291Its not that I want to duplicate your website, but I really like the style. Could you tell me which style are you making use of? Or was it custom made? 868118
448359 8247This post contains excellent original thinking. The informational content here proves that items arent so black and white. I feel smarter from just reading this. 493455
644081 995419A weblog like yours ought to be earning much cash from adsense.~::- 73869