Narayana Murthy: బాలీవుడ్ (Bollywood) నటి కరీనా కపూర్ (Kareena Kapoor) అభిమానులను పట్టించుకోరంటూ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి (Narayana Murthy) చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆరు నెలల క్రితం ఓ చర్చా కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. అయితే.. ఆయన సతీమణి సుధామూర్తి కరీనాకు మద్దతిచ్చారు.
‘నేనోసారి లండన్ (London) నుంచి వస్తుంటే విమానంలో నా పక్క సీట్లో కరీనా కపూర్ కూర్చున్నారు. ఆమెను గుర్తుపట్టి అభిమానులు పలకరించారు. కానీ.. కరీనా స్పందించలేదు. నాకు ఆశ్చర్యం వేసింది. మనల్ని ఎవరైనా పలకరిస్తే స్పందిస్తాం. అంతకుమించి వారు కోరుకునేది ఏముంద’ని అన్నారు. దీనికి ఆయన సతీమణి సుధామూర్తి స్పందిస్తూ..
’సినీ నటిగా కోట్లలో అభిమానులు ఉంటారు. పర్యటనలతో విసిగిపోయి ఉండొచ్చు. సాఫ్ట్ వేర్ కంపెనీ ఫౌండర్ గా మీకు గట్టిగా 10వేల మంది అభిమానులు ఉంటారేమో. ఆమెకు కోట్లలో ఉండొచ్చ’ని అన్నారు. దీనికి ఆయన స్పందిస్తూ.. ‘ఇక్కడ సమస్య అది కాదు. మనపై అభిమానం చూపినప్పుడు వారిపై ప్రేమ చూపడం చాలా ముఖ్య’మని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
I do not even know how I stopped up here, however I thought this submit was once great.
I do not recognize who you are however definitely you’re
going to a famous blogger in case you are not already. Cheers!