కరోనా నేపథ్యంలో చాలాకాలం పాటు తెలంగాణలోని హైద్రాబాద్కే పరిమితమైపోయిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన పుత్రరత్నం నారా లోకేష్.. ఇప్పుడు రంగంలోకి దూకేసినట్లే కనిపిస్తోంది. చంద్రబాబు ఇంకా మీనమేషాల్లెక్కెడుతున్నారుగానీ, లోకేష్ మాత్రం ధైర్యం చేసేస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన నారా లోకేష్, మంత్రి కన్నబాబుపై దుమ్మెత్తిపోసేశారు.
‘వ్యవసాయ మంత్రి కన్నబాబు సొంత జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.. 60 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు.. వర్షాలు, వరదల కారణంగా పెద్దయెత్తున పంట పొలాలు నీటిలో మునిగిపోయాయి.. మంత్రి ఏం చేస్తున్నారు.? ప్రశ్నిస్తే, నా మీద వెటకారాలు చేస్తారు. వెటకారాలు మానెయ్యండి.. నీళ్ళలోకి దిగి చూండి..’ అంటూ నారా లోకేష్ ఆవేశంతో ఊగిపోయారు.
‘ఒక్క ఛాన్స్’ ఇచ్చినందుకు రాష్ట్రాన్ని వైఎస్ జగన్ నిలువునా ముంచేశారంటూ నారా లోకేష్ విరుచుకుపడ్డారు. ‘ముంపు ప్రాంతాల్లో పేదలకు భూములు ఇస్తామని చెబుతారా.? దాన్ని ప్రశ్నిస్తే మా మీద దాడి చేస్తారా.? ఏవీ మీరు ప్రజలకు ఇస్తామన్న భూములు.? ఇప్పుడు నీళ్ళలోకి దిగి చెప్పండి, మీరు ఏ భూముల్ని ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నారో..’ అంటూ లోకేష్ తీవ్రస్థాయిలో అధికార వైసీపీ మీద విరుచుకుపడ్డారు.
నారా లోకేష్ రాకతో టీడీపీ శ్రేణుల్లో కొంతమేర ఉత్సాహం బాగానే కనిపించింది. అయితే, కరోనా నేపథ్యంలో గుంపులుగా నేతల్ని, కార్యకర్తల్ని వెంటేసుకురావడం ఎంతవరకు సబబు.? అన్న ప్రశ్న తలెత్తుతోంది. అధికార పార్టీ నేతలూ ఈ విషయంలో అత్యుత్సాహమే చూపుతున్నారు. కరోనా కేసుల్లో తూర్పుగోదావరి జిల్లానే అగ్రస్థానంలో వుంది. ఇప్పుడిప్పుడే అక్కడా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి.
ఇప్పుడీ రాజకీయ యాత్రలతో మళ్ళీ కరోనా అక్కడ విజృంభిస్తుందా.? అన్న అనుమానాలైతే జనంలో నెలకొంటున్నాయి. ఒక్కటి మాత్రం నిజం.. అధికార పార్టీ నేతలు పబ్లిసిటీ స్టంట్స్కే పరిమితమవుతున్నారు. బాధితుల కష్టాల్ని వినేందుకు అధికార పార్టీ నేతలు సుముఖత వ్యక్తం చేయడంలేదు. ఒకవేళ జనంలోకి వెళ్ళినా, మొక్కుబడి యాత్రలకే పరిమితమవుతున్నారు వైసీపీ నేతలు, మంత్రులు. అన్నట్టు, లోకేష్ ఆవేశం బాగానే వుందిగానీ.. అట్నుంచి, అదే వైసీపీ నుంచి వచ్చే ‘వెటకారం’ ఎలా వుంటుందో మరి.!
244232 378205youve got an crucial weblog right here! would you wish to make some invite posts on my blog? 222298