దేశంలో కరోనా విలయతాండవం చేస్తోన్న నేపథ్యంలో రానున్న రెండు, మూడు వారాలు మరింత కీలకమని పలువురు అధికారులు అంటున్నారు. లాక్ డౌన్ అమలు కావచ్చని మరికొందరు అంటున్నారు. మరికొందరు లాక్డౌన్ పెట్టే అవకాశం లేదంటున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించారు. ఇంత గందరగోళ పరిస్థితులు నెలకొన్న వేళ సినీ దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన ఓ ట్వీట్ ఆసక్తి రేపుతోంది.
రానున్న రోజుల్లో లాక్డౌన్ ఉన్నా లేకున్నా ఇంట్లోనే ఉందాం. లాక్డౌన్పై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా మనందరం ఇదే చేద్దాం. రానున్న రెండు వారాలు వ్యక్తిగతంగా లాక్డౌన్ పాటిద్దాం. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్డౌన్ సమాధానం కాదని ఎవరైతే అంటున్నారో వాళ్లందరూ ఒక్కసారి ఆసుపత్రులను పరిశీలిస్తే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి. గడిచిన నెల రోజులుగా ఆసుపత్రుల్లో వైద్యులు ఎలా సేవలందిస్తున్నారో చూడండి. కాబట్టి.. మనందరం తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకుందాం. వైద్యులకు కొంత ఉపశమనం అందిద్దాం’ అని నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
652025 604716very very good put up, i truly enjoy this web web site, keep on it 626581
639997 790534Nicely picked details, several thanks towards the author. Its incomprehensive in my experience at present, even so in common, the convenience and importance is mind-boggling. Regards and all the best .. 677163
53402 37527hi this post aid me full . .if you want watches males visit my sites is really aid you for men watches. .thank man great job. 891404