పిల్లలకు తల్లి ప్రేమను పంచాల్సిన ఓ తల్లి ప్రియుడి మోజులో పడింది. కట్టుకున్న భర్తను కాదంది. కంటి రెప్పల్లా కాపాడుకోవాల్సిన కన్న బిడ్డలను ప్రియుడితో కలిసి హతమార్చింది. తన ఇద్దరు పిల్లల్లో చిన్న కుమారుడిని హతమార్చింది. పెద్ద కొడుకు కాళ్లు విరగ్గొట్టింది. విస్తుగొలిపే ఈ ఘటన జగ్గయ్యపేట సమీపంలో జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం పరిధిలోని మానుకొండ గ్రామానికి చెందిన ప్రసాద్, ఉష దంపతులు. వీరికి సుకుమార్, అంకిత్ పిల్లలు. తాపీ పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. పనులు చేసే చోట ఉషకు శివ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారి తీసింది. భర్తను వదిలేసి జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో ఒక అద్దె ఇంట్లో ప్రియుడితో ఉంటోంది. ఉష పిల్లలను తన వద్దే ఉంచుకుంది. ఈ నెల 4వ తేదీ రాత్రి పిల్లలు అల్లరి చేస్తున్నారని ఆగ్రహంతో వీరిద్దరూ తీవ్రంగా కొట్టారు. దెబ్బల తాకిడికి 18 నెలల అంకిత్ మూర్చతో పడిపోయి కాసేపటికి అక్కడే మృతి చెందాడు. ఆందోళనతో పిల్లలకు జ్వరం వచ్చిందని చెప్పి వెళ్లిపోయారు.
ఇంటి యజమానికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారి ఆచూకి కనిపెట్టారు పోలీసులు. అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన దారుణాన్ని వివరించారు. కోదాడ మండలం చిలుకూరు గ్రమ సమీపంలో అంకిత్ ను పూడ్చిపెట్టామని ఒప్పుకున్నారు. ఉష ప్రియుడు సెల్ ఫోన్లు, బైక్ లు దొంగతనం చేస్తాడని పోలీసుల విచారణలో తేలింది. ఉష ఇంట్లో నలభై సెల్ ఫోన్లు, దొరికాయి.
168316 319109Im having a small issue. Im unable to subscribe to your rss feed for some reason. Im making use of google reader by the way. 536445
74339 957105I like this web website because so a lot utile stuff on here : D. 309504
464800 951925Intriguing, but not perfect. Are you going to write far more? 74247