ప్రపంచ వ్యాప్తంగా మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ ఎమర్జెన్సీ ని ప్రకటించింది. డబ్ల్యూహెచ్ఓ ప్రకటన నేపథ్యంలో భారత ప్రభుత్వం మంకీ పాక్స్ పై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. భారత్ లో మంకీపాక్స్ కేసుల సంఖ్య నాలుగుకు చేరడంతో సీరియస్ గా తీసుకున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
పలు దేశాల్లో మంకీ పాక్స్ కేసుల తీరు తెన్నులు మరియు అక్కడ జరుగుతున్న ట్రీట్మెంట్ గురించి కూడా చర్చించారు. ఢిల్లీ లో విదేశీ ప్రయాణాల చరిత్ర లేని 34 ఏళ్ల వ్యక్తికి మంకీ పాక్స్ కేసు నిర్థారణ అయ్యింది. దాంతో మంకీ పాక్స్ విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండటంతో పాటు అధికారులు.. కింది స్థాయి ఉద్యోగులు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేశారు.