ఏపీలో పోలింగ్ కు సమయం సమీపిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి.
అధికార తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో పక్కాగా ప్లాన్ చేసుకుని సన్నద్ధంగా ఉంది. ఇప్పటివరకు వచ్చిన సర్వేల్లో ఏ ఒక్కదాంట్లోనూ అనుకూల ఫలితం రాకపోవడంతో ముందుగానే అప్రమత్తమైంది. ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకుంటే ఓట్లు పడతాయనే అంశంపై బాగానే కసరత్తు చేసింది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు ముందుగానే రచించుకుంది.
ఏప్రిల్ 11న ఏపీలో పోలింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వివిధ పథకాల కింద ప్రజలకు డబ్బు చెల్లించే ఏర్పాట్లు చేసుకుంది. ఏప్రిల్ 1న యథావిధిగా పించన్లు పంపిణీ చేస్తుంది. 4న పసుపు-కుంకుమ పథకం కింద డ్వాక్రా మహిళలకు చెక్కులు అందించనుంది.
ఇక 5న రుణమాఫీ నాలుగు, ఐదో విడతల మొత్తం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. 8న అన్నదాతా సుఖీభవ పథకం కింద రైతులకు పెట్టుబడి మొత్తాన్ని ఖాతాల్లో వేస్తుంది. అధికారికంగా ఇచ్చే ఈ డబ్బులతోపాటు పోలింగ్ కు ముందు రోజు ఓటర్లకు ఇచ్చే తాయిలాలూ ఎలాగూ ఉంటాయి. అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పోలింగ్ కు ముందు వరకు ఏదో ఒక రూపంలో జనానికి డబ్బు అందుతుందన్న మాట.
వాస్తవానికి రుణమాఫీకి సంబంధించి నాలుగు, ఐదు విడతల మొత్తం ఫిబ్రవరిలో వేస్తామని టీడీపీ సర్కారు గతంలో ప్రకటించింది. అయితే, అప్పుడే వేస్తే పోలింగ్ సమయానికి మరచిపోయే అవకాశం ఉందని భావించి, ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ అనుకున్న ప్రకారం ఈ కార్యక్రమాలన్నీ కచ్చితంగా జరపాలని టీడీపీ అధినాయకత్వం నిర్ణయించింది.
పించన్ల పంపిణీకి సంబంధించి ఎలాంటి సమస్యా లేదు. అలాగే పసుపు-కుంకుమ పథకం కింద చెక్కులు ఇస్తారు కాబట్టి దానికీ నిధుల సమస్య ఉండదు. ఇక అన్నదాతా సుఖీభవ కింద ఈ విడతలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మొత్తం రూ.1000 మాత్రమే. ప్రధానమంత్రి కిసాన్ వికాస్ యోజన పథకం ద్వారా ఇచ్చే సొమ్ముకు ఈ వెయ్యిని రాష్ట్ర ప్రభుత్వం జోడించి ఆయా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది.
రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మంది అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం రూ.500 కోట్లు మాత్రమే కావడంతో దీనికీ నిధుల సమస్య లేదు. ఇక రుణమాఫీ నాలుగు, ఐదు విడతల మొత్తం కూడా ఇప్పుడే చెల్లించాలని ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇది కొంచెం పెద్ద మొత్తం కావడంతో నిధుల సమస్య తలెత్తే అవకాశం ఉంది.
రైతులకు ఒక్కో విడతకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు చెల్లించాల్సి ఉందని అంచనా. అంటే రెండు విడతలకు కలిపి దాదాపు రూ.70 వేలకు పైగా జమ చేయాల్సి ఉంటుంది. ఇందుకు చాలా పెద్ద మొత్తమే కావాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భారీ మొత్తం ఎలా సర్దుబాటు అవుతుందనే అంశంపై ప్రభుత్వ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం.
అయితే, రుణమాఫీ అనేది గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కాబట్టి, ఈ ఎన్నికల ముందైనా దానిని నెరవేర్చకుంటే ఓటింగ్ పై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏదో ఒక విధంగా ఆ మొత్తం సర్దుబాటు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే, మాఫీ మొత్తం పూర్తిగా వేస్తారా? లేక నిధుల లభ్యతకు అనుగుణంగా తగ్గించి వేస్తారా అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. పోలింగ్ కు ముందు వేసే డబ్బులు కాబట్టి, కచ్చితంగా ఓట్లు తమకు అనుకూలంగా పడతాయని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి, వారి అంచనా నిజమవుతుందో లేదో తెలియాలంటే మే 23 వరకు ఆగకు తప్పదు.
319092 15129Id need to verify with you here. Which is not 1 thing I usually do! I take pleasure in reading a submit that will make individuals believe. In addition, thanks for permitting me to remark! 775852
859156 395426I liked than you may be right now. 415260
829497 754044What a lovely weblog. Ill definitely be back. Please preserve writing! 985595