రాజకీయాల్లో ఎంతో అనుభవం సంపాదించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఇప్పుడు అనవసర తప్పిదాలు చేస్తున్నారా? చిన్న విషయాల్లో కూడా సరైన నిర్ణయం తీసుకోలేక తప్పటడుగులు వేస్తున్నారా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది.
రాష్ట్రంలోకి సీబీఐ ప్రవేశాన్ని నిషేధించడం దగ్గర నుంచి కేంద్ర ఎన్నికల సంఘంతో ప్రస్తుతం అవలంభిస్తున్న వైఖరి వరకూ అన్నీంటా అనవసర తప్పిదాలు చేశారని అంటున్నారు. ఆయా అంశాల్లో తప్పులు లేకుంటే ఇంత హంగామా చేయాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే కేంద్ర ఎన్నికల సంఘమే సుప్రీం. ఎన్నికల సంఘం తీసుకునే ప్రతి నిర్ణయం రాజ్యాంగం చెల్లుబాటయ్యేదే. కోడ్ అమల్లో ఉండగా.. ప్రధాని సహా అందరి అధికారాలకూ కోత తప్పదు. అలాగే ఎన్నికల ముందు అధికారుల బదిలీలు జరగడం కూడా చాలా సర్వసాధారణమైన విషయం. ఆరోపణలున్న అధికారులను బదిలీ చేయడం ఈసీ విధి.
ఇదే తరహాలో ఏపీలో కూడా ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆ అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడంతోనే ఈసీ వారిపై చర్యలు తీసుకుంది. ఈసీ నిర్ణయానికి అనుగుణంగా టీడీపీ వ్యవహరిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు.
పైగా హూందాగా వ్యవహరించిందనే పేరు కూడా వచ్చేది. తొలుత, ఈసీ ఆదేశాలను పాటించిన ఏపీ సర్కారు.. అంతలోనే మనసు మార్చుకుంది. ఇద్దరు ఎస్పీలను బదిలీ చేసి, ఇంటెలిజెన్స్ డీజీ బదిలీని మాత్రం నిలిపివేసింది. అనంతరం నేరుగా ఈసీపై పోరుకు దిగింది. ఈ వ్యవహారంపై నేరుగా ఈసీకి తన అసంతృప్తి వ్యక్తంచేస్తూ లేఖ రాయడమే కాకుండా కోర్టులో వ్యాజ్యం కూడా దాఖలు చేసింది.
మరోవైపు తెలుగుదేశం నేతలు ఈసీపై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. ఎన్నికల సంఘానికి ఇంగితం లేదని, పరిధి దాటి ప్రవర్తిస్తోందని అనుచిత వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఇది టీడీపీకే ప్రతికూలంగా మారింది. తమకు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారి బదిలీ అయితే, ఎన్నికల్లో ఇబ్బంది కలుగుతుందని భావించడం వల్లే ఏపీ సర్కారు ఇలా ప్రవర్తిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ ప్రతిపక్ష నేతల ఆరోపణల్లో నిజం లేకుంటే టీడీపీ ఇంతగా స్పందించాల్సిన అవసరం ఉండేది కాదు. అలాకాకుండా ఏకంగా ఈసీతోనే పోరుకు దిగడంతో అంతర్గతంగా ఏదో జరుగుతుందనే భావన జనాల్లో కలుగుతోంది. మరోవైపు ఈ అంశంలో చంద్రబాబు వైఖరిని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నేతలు దనుమాడుతున్నారు.
పదేళ్ల క్రితం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశారో మరచిపోయారా అంటూ ప్రశ్నిస్తున్నారు. 2009 ఎన్నికల సమయంలో డీజీపీగా ఉన్న ఎస్ఎస్పీ యాదవ్ పై చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆయన అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు. యాదవ్ ని బదిలీ చేసేంత వరకు వదిలిపెట్టకుండా పోరాటం సాగించారు.
దీంతో కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీ యాదవ్ ను తప్పించి, ఆయన స్థానంలో మహంతిని నియమించింది. దీనిపై అప్పటి వైఎస్ ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఈసీ ఆదేశాల మేరకే నడుచుకుంది. ఆ ఎన్నికల్లో వైఎస్ తిరిగి అధికారం చేపట్టారు. అయితే, చంద్రబాబు ఆ సంగతి మరచిపోయి ఇప్పుడు ఏకంగా ఈసీపైనే పోరుకు దిగడం, ఆయన ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమని వైఎస్సార్ సీపీ నేతలు విమర్శిస్తున్నారు.
కేవలం ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీలకే చంద్రబాబు ఇంత హంగామా చేయడం చూస్తుంటే, ఇక డీజీపీని బదిలీ చేస్తే ఏ విధంగా స్పందిస్తారో అర్థంకావడంలేదని అంటున్నారు. ప్రస్తుత డీజీపీ ఠాకూర్ పై కూడా వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఆయన టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని, ఎన్నికలు సజావుగా జరగాలంటే ఆయన్ను తప్పించాల్సిందేనని ఈసీకి ఇప్పటికే విన్నవించారు. అయితే, ఈసీ మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ డీజీపీని బదిలీ చేస్తే బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిందే.
330077 699945I genuinely treasure your function , Great post. 784862
836634 136631you got a very exceptional web site, Sword lily I located it by way of yahoo. 952554
916814 521410Slide small cooking pot inside the cable to make it easier for you to link the other big wooden bead for the conclude with the cord. 841851