మంత్రి చెప్పే మాటకీ, ముఖ్యమంత్రి మనసులో వున్నదానికీ ‘తేడా’ వుంటుందా.? వుండదని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే, అమరావతి విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ అనుమానాలు ఒకలా వుంటే, ఇంకో మంత్రి అవంతి శ్రీనివాస్ ఆలోచనలు మరోలా వున్నాయి. మరో మంత్రి కొడాలి నాని ఉద్దేశ్యం వేరే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి మాత్రం ఇప్పటిదాకా రాజధాని అమరావతి విషయమై పెదవి విప్పలేదు.
ఇక, పోలవరం ప్రాజెక్టు ‘ఎత్తు’ తగ్గింపు వ్యవహారంపై మంత్రి అనిల్కుమార్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు. అలాంటి అవకాశమే లేదని తేల్చేశారు. ‘ఇప్పటిదాకా ఏ డిజైన్లతో పోలవరం పనులు జరుగుతున్నాయో, అవే డిజైన్లతో, అంతే ఎత్తుతో పోలవరం ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతాయి’ అని చెప్పారు అనిల్.
ఎత్తు తగ్గింపు దిశగా ఇప్పటికే వైఎస్ జగన్తో చర్చించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ అసెంబ్లీలో ప్రకటించిన దరిమిలా వివాదం ముదిరి పాకాన పడిన విషయం విదితమే. అయితే, ‘అది తెలుగుదేశం పార్టీ గగ్గోలు మాత్రమే..’ అని కొట్టి పారేసిన అనిల్, కేసీఆర్ ప్రకటనని తప్పు పట్టేంతటి సాహసం చేయలేదు.
నిన్న కేసీఆర్ – జగన్ భేటీ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు అంశం ప్రస్తావనకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోన్న విషయం విదితమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాజధాని, పోలవరం.. ఈ రెండూ ప్రధానమైనవి. అమరావతికి ఖర్చు దండగ.. అని ఇప్పటికే కేసీఆర్ తేల్చారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గుతుందనీ కేసీఆర్ స్పష్టతనిచ్చారు.
మరి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మనసులో ఏముంది.? మంత్రి అనిల్ మాటల్ని ప్రామాణికంగా తీసుకోగలమా.? కేసీఆర్ వ్యాఖ్యల్ని ఖండించి, ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి తన బాధ్యతను గుర్తెరిగి ఈ అంశాలపై స్పందించగలరా.? వేచి చూడాల్సిందే.
735605 573499This kind of publish appears to get yourself a great deal of visitors. How will you acquire traffic to that? It provides a terrific exclusive twist upon issues. I guess having something traditional or perhaps substantial to give info on may be the central aspect. 189614
440138 741496I visited a great deal of web site but I conceive this 1 contains something special in it in it 296142