ఏడాది క్రితం వరకు చిత్ర పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా దర్శకరత్న దాసరి నారాయణరావే పరిష్కరించేవారు. అందరితో ఆయనకు ఉన్న సంబంధాలు, పెద్దరికం వంటి అంశాలన్నీ ఆయన్ను చిత్ర పరిశ్రమకు పెద్దదిక్కుగా నిలబెట్టాయి. దాసరి సైతం ప్రతి విషయంలోనూ ముందుంటూ పరిశ్రమ బాగోగులు చూశారు. అయితే, ఆయన మరణం తర్వాత సహజంగానే ఇండస్ట్రీకి ఇక పెద్ద దిక్కు ఎవరనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పేర్లు తెర పైకి వచ్చాయి.
అయితే, విద్యాసంస్థల నిర్వహణ కార్యకలాపాలతో మోహన్ బాబు ఎక్కువ సమయం తిరుపతితోనే ఉంటుండటంతో చిరంజీవి ఒక్కరే అందరికీ ఆప్షన్ అయ్యారు. పైగా రాజకీయాల్లోకి వెళ్లి విఫలమైన ఆయన.. తిరిగి సినిమాలపైనే దృష్టి పెట్టి, రాజకీయాలకు దూరంగా ఉండటంతో మళ్లీ అందరివాడుగా మారారు.
అంతేకాకుండా పరిశ్రమకు సంబంధించిన విషయాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. ఇక్కడ కూడా సొంతంగానే నిర్ణయాలు తీసుకోకుండా ఇండస్ట్రీ పెద్దలుగా ఉన్న మోహన్ బాబు, మురళీ మోహన్, కృష్ణంరాజు, సుబ్బరామిరెడ్డి వంటివారందరితోనూ సంప్రదించి ముందుకెళ్తున్నారు. తద్వారా తాను ఒక్కడే పెద్ద కాదని, తామందరం కలిస్తేనే చిత్ర పరిశ్రమ అనే సంకేతాలు ఇస్తున్నారు.
స్వతహాగా మృదు స్వభావి, వివాదరహితుడిగా పేరున్న చిరంజీవితో కలిసి పనిచేయడానికి మిగిలిన పెద్దలకు సైతం ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో చిత్ర పరిశ్రమలో చక్కటి వాతావరణం నెలకొంది. తాజాగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) డైరీ ఆవిష్కరణ సభలో రాజశేఖర్ చేసిన రచ్చను అందరూ ఖండించడమే ఇందుకు నిదర్శనం.
మరోవైపు చిరంజీవి సైతం మా వ్యవహారాలను చక్కదిద్దడానికి గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నారు. తద్వారా పరిశ్రమ అభివృద్దికి తన వంతు కృషి చేస్తున్నారు.
776769 892462I genuinely enjoy seeking by way of on this web site , it holds superb articles . 653298
339923 818665Exceptional read, I just passed this onto a colleague who was performing a little research on that. And he truly bought me lunch as I discovered it for him smile So let me rephrase that: Thank you for lunch! 789491