Chiranjeevi: తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ని టాలీవుడ్ (Tollywood) మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) మర్యాదపూర్వకంగా కలిశారు. రేవంత్ రెడ్డి నివాసానికి ఈరోజు వెళ్లిన చిరంజీవి ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరిరువురూ కలవడం ఇదే మొదటిసారి.
అనంతరం వీరిరువురూ కాసేపు అభిమానంగా పలకరించుకున్నారు. పలు అంశాలపై చర్చించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిరంజీవి అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు వీరి కలయికపై సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన తర్వాత చిరంజీవి టాలీవుడ్ నుంచి మొదటగా సోషల్ మీడియా వేదికగా ఆయన్ను అభినందించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ మరింతగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఆయనతోపాటు ఇతర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా శుభాకాంక్షలు తెలిపారు.
MEGASTAR #Chiranjeevi garu Met Honourable Chief Minister Of Telangana @revanth_anumula garu at His Residence
Boss @KChiruTweets #RevanthReddy@TelanganaCMO #TelanganaCM #MegastarChiranjeevi pic.twitter.com/FGBMGwC5X7
— Chiranjeevi Army (@chiranjeeviarmy) December 25, 2023